జాతీయోద్యమం - ఆతివాద యుగం: 1905 - 1919 - GNANA SAMHITHA

Breaking

Post Top Ad

Thursday, March 20, 2025

జాతీయోద్యమం - ఆతివాద యుగం: 1905 - 1919

👉🏻1905 నుండి ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లో అతివాదుల ఆధిపత్యం కొనసాగింది.
👉🏻అతివాదుల డిమాండ్‌ మేరకు 1905లో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ గోఖలే నేతృత్వంలో వారణాసి ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సమావేశంలో బెంగాల్‌కు వర్తించే విధంగా స్వరాజ్య తీర్మానం ఆమోదించబడింది.
👉🏻1906లో అతివాదుల డిమాండ్‌ మేరకు దాదాబాయ్‌ నౌరోజీ నేతృత్వంతో కలకత్తా ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్ సమావేశంలో మొత్తం భారతదేశం వర్తించే విధంగా స్వరాజ్య తీర్మానం ఆమోదించబడింది.
👉🏻1907లో రాష్‌ బిహారీ బోస్‌ అధ్యక్షతన సూరత్‌ ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సమావేంలో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్‌కాంగ్రెస్ అధికారికంగా రెండుగా చీలిపోయింది. (మితవాదులు -అతివాదులు)

అతివాద యుగం ఆవిర్భవానికి కారణాలు:
i) బ్రిటిష్ పరిపాలకుల ఆర్థిక దోపిడీని భారతీయులు గ్రహించారు. ఆంగ్లేయులు అవలంబించిన ఆర్థిక విధానాలతో భారతదేశంలో 1896-1900 సంవత్సరాల మధ్య తీవ్ర కరవులు సంభవించాయని అర్థం చేసుకున్నారు.
ii) మితవాదులు అవలంబించిన విధానాలు విఫలం కావడం, 1892లో బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన ఇండియా కౌన్సిళ్ల చట్టం భారతీయులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
iii) బ్రిటిష్ ప్రభుత్వ అణచివేత విధానాలు: జాతీయవాదాన్ని ప్రచారం చేయడం నేరమంటూ 1898లో చేసిన చట్టం, పత్రికల స్వేచ్ఛను హరించడానికి 1904లో చేసిన భారత అధికార రహస్యాల చట్టం, బాలగంగాధర తిలక్, ఇతర పత్రికా సంపాదకులను జాతీయవాదాన్ని ప్రచారం చేసినందుకు జైలులో నిర్బంధించడం దీనికి ఉదాహరణలు.
iv) సామాన్య ప్రజలను జాతీయోద్యమంలో భాగస్వాములుగా చేయాలని నిర్ణయించారు. ఏడాదికోసారి సమావేశాల నిర్వహణకు బదులు, నిరంతర రాజకీయ కార్యక్రమాలు నిర్వహించాలని భావించారు.
v) భారతీయుల్లో ఆత్మగౌరవం పెంపొందించడం. స్వరాజ్యం ప్రతి భారతీయుడి జన్మ హక్కని తిలక్ ప్రకటించడం, వివేకానందుడు 'బలహీనత పాపం, బలహీనతే మరణం' అని బోధించడం.
vi) అంతర్జాతీయ సంఘటనల ప్రభావం: జపాన్ గొప్ప శక్తిగా ఎదగడం, 1905లో జపాన్, రష్యాను ఓడించడం, 1896లో ఇథియోపియా చేతిలో ఇటలీ సైన్యం ఓటమి, ఐర్లాండ్, రష్యా, ఈజిప్ట్, టర్కీ, చైనా దేశాల్లో విప్లవ ఉద్యమాలు భారతీయులు స్వరాజ్యం కోసం పోరాటాన్ని ముమ్మరం చేయడానికి తోడ్పడ్డాయి.

లక్ష్యాలు:
•మితవాదుల అన్ని లక్ష్యాలు
•స్వరాజ్యము
•బ్రిటన్‌ పరిశ్రమల నుంచి భారతీయులు చేనేతకారులను రక్షించుట

పద్ధతులు:
1. ఊరేగింపులు
2. స్వదేశీ మరియు బహిష్కరణ
3. విదేశీ వస్తాలను దహనం చేయుట
4. గణేష్‌ శివాజీ ఉత్సవాలను జరిపించడం
5. వార్తాపత్రికలు
6. సంస్థలు
7. పుస్తకాలు
8. పట్టణాల్లో సమావేశాలు నిర్వహించుట

వందేమాతర ఉద్యమం (1905-11):

•అతివాద నాయకులు భారతదేశంలో మొదటిగా చేపట్టిన ప్రధాన ఉద్యమం వందేమాతర ఉద్యమం
•1905లో బెంగాల్‌ విభజన కారణంగా “వందేమాతర ఉద్యమం” ప్రారంభం అయింది.
•బెంగాల్‌లోని జాతీయ ఉద్యమ భావాలను అణచివేయుటకు అప్పటి గవర్నర్‌ జనరల్‌ “లార్డ్‌ కర్జన్‌” బెంగాల్‌ను రెండుగా విభజించాలని నిర్ణయించాడు.
•బెంగాల్‌ భౌగోళికంగా అతిపెద్ద ప్రాంతము, పరిపాలనా సౌలభ్యం కొరకు దీనిని రెండు భాగాలు విభజిస్తున్నట్లు లార్డ్‌ కర్జన్ 1905 జులై 19న అధికారిక ప్రకటన చేశాడు. తక్షణమే ఈ ప్రతిపాదనను ఖండిస్తూ. ఎ.యన్‌. బెనర్జీ, కె. కె మిత్రాలు బెంగాల్‌ విభజన వ్యతిరేక ఉద్యమాలను చేపట్టారు.
•కె.కె మిత్ర యొక్క 'సంజీవని” పత్రికలో మొట్టమొదటగా “బాయ్‌కాట్‌ లేదా బహిష్కరణ” అనే పదం పేర్కొనబడింది.
•1905 సెప్టెంబర్‌లో మద్రాస్‌ బీచ్‌లో "సుబ్రమణ్యం అయ్యర్ అధ్యక్షతన ఒక సమావేశం జరిగింది.
•ఈ సమావేశంలో
1. సుబ్రమణ్య భారతి తమిళ పద్యాలు ఆలపించాడు.
2. కేళా శ్రీరామ్మూర్తి వందేమాతర గీతం ఆలపించాడు.
3. సి.హెచ్‌ సుబ్బారావు నేతృత్వంలో ఉద్యమ వ్యాప్తికి జాతీయ నిధి ఏర్పాటుచేయబడింది.
•1905 అక్టోబర్‌ 16న బెంగాల్‌ విభజన అమలులోకి వచ్చింది. •దీని ప్రకారం బెంగాల్‌ రెండు భాగాలుగా(పశ్చిమ బెంగాల్‌, తూర్పు బెంగాల్‌గా విభజించబడినది. పశ్చిమ బెంగాల్‌లో ముస్లిములు మైనార్టీలు కాగా, తూర్పు బెంగాల్‌లో హిందువులు మైనార్టీలు అయ్యారు.
•ఈ అక్టోబర్‌ 16వ తేదీను బెంగాల్‌లోని ప్రజలు “బ్లాక్‌ డే లేదా మౌర్నింగ్ డే(నిరసన దినం)గా పాటించారు.
•అక్టోబర్‌ 16వ తేదీన ప్రజలు పాదరక్షలు లేకుండా వీధులలోకి వచ్చి స్థానిక జలాశయాలలో పవిత్ర స్నానాలు చేసి సోదర భావత్వాన్ని పెంపొందించుటకొరకు రాఖీ ఉత్సవాలు జరుపుకొన్నారు.
•ఇక నుండి విదేశీ వస్తువుల ఉపయోగాన్ని బహిష్కరించి కేవలం స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగించాలని బెంగాల్‌లోని ప్రజలు అదే రోజున (అక్టోబర్‌ 16)న ప్రతిజ్ఞ చేశారు. దీనితో 'స్వదేశీ ఉద్యమం” ప్రారంభం అయింది.
•ఉద్యమ కారులు వందేమాతర గీతాన్ని ఆలపిస్తూ బెంగాల్‌
•విభజన వ్యతిరేక ఉద్యమాలను చేపట్టారు. దీనితో ఈ ఉద్యమానికి వందేమాత ఉద్యమం అని పేరు వచ్చింది. మొదట్లో వందేమాతర ఉద్యమం మితవాదుల ఆధీనంలో ఉండేది.
•1906లో వందేమాతర ఉద్యమం అతివాదుల చేతులలోకి వచ్చింది.
•వందేమాతర ఉద్యమాన్ని భారతదేశం అంతా వ్యాప్తి చేసి దీనిని ఒక జాతీయ ఉద్యమంగా మార్చాలని అతివాదులు నిర్ణయించారు.
•1906 డిసెంబర్‌లో దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన ఐ.యన్‌.సి వార్షిక సమావేశం కలకత్తాలో జరిగింది. ఈ సమావేశంలో స్వరాజ్యం, స్వదేశీ, బహిష్కరణ, జాతీయ విద్య అనే నాలుగు తీర్మానాలు ఆమోదించబడ్డాయి.
•ఈ సమావేశానికి హాజరైన నాయకులు తమ ప్రాంతాలకు వెళ్లిన తరువాత వందేమాతర ఉద్యమాన్ని తమ ప్రాంతాలలో వ్యాప్తి చేయాలని అతివాదులు పిలుపు ఇచ్చారు.
•దీంతో వందేమాతర ఉద్యమం భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో వ్యాపించింది.
•బిపిన్‌ చంద్రపాల్‌ ఆంధ్రాలో వందేమాతర ఉద్యమాన్ని వ్యాప్తి చేశాడు. రాజమండ్రి లో బిపిన్‌ చంద్రపాల్‌ ఉపన్యాసాన్ని చిలకమర్తి లక్ష్మీ నరసింహం తెలుగులోకి అనువాదించాడు.
వందేమాతర ఉద్యమ కాలంలో ఆంధ్రలో సంఘటనలు
1. రాజమండ్రి ప్రభుత్వ కళాశాల సంఘటన
2. కాకినాడ సంఘటన
తి. కోటప్పకొండ సంఘటన
4. తెనాలి బాంబు కేసు

వందేమాతర ఉద్యమం-రబీంద్రనాథ్‌ ఠాగూర్‌:
•1905లో బెంగాల్‌ విభజన జరిగినపుడు రబీంద్రనాథ్‌ ఠాగూర్‌ అమర్‌ సోనార్‌ బంగ్లా అనే గీతాన్ని రచించాడు. ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్‌ యొక్క జాతీయగీతం
•1911లో బెంగాల్‌ విభజన రద్దయినవుడు రబీంద్రనాథ్‌ ఠాగూర్‌ జనగణమన గీతాన్ని బెంగాలీ సంస్కృతంలో రచించాడు. ఇది ప్రస్తుతం భారతదేశం యొక్క జాతీయ గీతం.
•1919 ఫిబ్రవరిలో రబీంద్రనాథ్‌ ఠాగూర్‌ మదనపల్లిలో జనగణమనను ఆంగ్లంలోకి అనువాదించాడు.
•జనగణమనకు స్వరకల్పన చేసినది -మార్గరెట్‌ కజిన్స్‌

వందేమాతర ఉద్యమం అంతం
•1911లో బ్రిటిష్‌ చక్రవర్తి జార్డ్‌ - 3 మరియు అతని భార్య మేరీ ఇండియాలో పర్యటించారు.
•ఈ సందర్భంగా గవర్నర్‌ జనరల్‌ రెండవ హార్డింజ్‌ ఢిల్లీ దర్చార్‌ను నిర్వహించాడు.
•ఈ ఢిల్లీ దర్చార్‌లో 5వ జార్జ్ స్వయంగా క్రింది ప్రకటనను చేశాడు.
1) రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్పు
2) బెంగాల్‌ విభజన రద్దు
•బెంగాల్‌ విభజనను రద్దు చేన్తున్నట్లు జార్జ్-5 అదికారికంగా ప్రకటించడంతో వందేమాతర ఉద్యమం పూర్తిగా అంతమయింది.

స్వదేశీ ఉద్యమం :

•1905 అక్టోబర్‌ 16న బెంగాల్‌ విభజన అమలులోకి వచ్చినపుడు బెంగాల్‌ ప్రజలు ఇక నుండి విదేశీ వస్తువుల ఉపయోగాన్ని బహిష్కరించి స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగించాలని ప్రతిజ్ఞ చేశారు.
•దీనితో భారతదేశంలో స్వదేశీ ఉద్యమం ప్రారంభమయింది.
•స్వదేశీ ఉద్యమం ఒక ఆర్థికపరమైన ఉద్యమం.
•స్వదేశీ వస్తువులను ఉపయోగించడం దీని ప్రధాన లక్ష్యం.
•భారతదేశంలోని ఈ క్రింది ప్రాంతాలలో స్వదేశీ ఉద్యమం ప్రధానంగా జరిగింది.
1. బెంగాల్‌ - అరబిందో ఘోష్‌ బి.సి. పాల్‌, అక్షయ్‌ కుమార్‌ దత్‌(ఇతను బారిసాల్ లో “స్వదేశీ బందన్‌ సమితి” అనే సంస్థను స్థాపించాడు).
2. మద్రాస్‌ - చిదంబరం పిళ్ళై(ఇతను స్వదేశీ స్టీమ్‌ నావిగేషన్‌ అనే సంస్థను స్థాపించాడు)
3. బాంబే - తిలక్‌
4. ఢిల్లీ - . హైదర్‌రాజా
5. పంజాబ్‌, లాహోర్‌, కాశ్మీర్ - అజిత్‌ సింగ్‌, లాలా లజపతిరాయ్‌

బాలా గంగాధర్‌ తిలక్‌:
•జననం 23-07-1856
•మరణం 01-08-1920
•బిరుదులు
- లోకమాన్య
- భారత అశాంతి జనకుడు(పితామహ) (వాలైంటైన్‌ చిరోల్‌ ఈ బిరుదును ఇచ్చాడు, Indian Unrest అనే పుస్తకంలో పేర్కోన్నాడు)
- Uncrowned Prince of India
•వార్తాపత్రికలు - కేసరి (మరాఠీ భాషలో), మరాఠా (ఆంగ్ల భాషలో)
•పుస్తకాలు - గీతారహస్య, ఆర్కిటిక్‌ హోమ్‌ ఆఫ్‌ వేదాస్‌
•సంస్థలు - తిలక్‌ అనేక లాఠీ క్లబ్లను ఏర్పాటు చేసి గోవధ నిషేధమును అమలు పరిచాడు. దీనినే అఖరాలు అంటారు. ఆర్యులు ఆర్కిటిక్‌ ప్రాంతం నుంచి వచ్చారని పేర్కొన్నాడు.
•1893లో గణేష్‌ ఉత్సవాలను ప్రారంభించాడు.
•1895లో శివాజీ ఉత్సవాలను ప్రారంభించాడు.
•1896లో మొదటిసారిగా విదేశీ వస్త్రాలను పూణే వద్ద దహనం చేశాడు.
•1897లో ప్లేగు కమిషన్‌ ఛైర్మన్‌ రాండ్‌కు వ్యతిరేకంగా తన వార్తాపత్రికలో అనేక వ్యాసాలను ప్రచురించాడు.
•దీనికి ప్రభావితులైన చాపేకర్‌ సోదరులు(బాలకృష్ణ, దామోదర్‌) రాండ్‌ మరియు ఐరెస్ట్‌ను హత్య చేశారు.
•దినిపై విచారణ జరిగి తిలక్‌కు సంవత్సరంన్నర (18 నెలలు) జైలుశిక్ష విధించబడింది.
•1908లో ప్రఫుల్లాచాకీ, కుడీరామ్‌బోస్‌లు ముజాఫరాపూర్‌ జడ్జి అయిన కింగ్స్‌ఫోర్డ్‌ను హత్య చేయుటకు ప్రయత్నించారు. కానీ విఫలమైనారు.
•వీరికి మద్దతుగా తిలక్‌ తన పత్రికలలో అనేక వ్యాసాలు ప్రచురించాడు. దీంతో తిలక్‌పై దేశద్రోహం కేసు నమోదై విచారణ జరిగి 6 సంవత్సరాల జైలుశిక్ష విధించబడింది. 1908 నుంచి 1914 వరకు మయన్మార్‌లోని మాందలే జైలులో నిర్చంధించబడ్డాడు.
•1916 ఏప్రిల్‌లో తిలక్‌ మహారాష్ట్రలో హోమ్‌రూల్‌ లీగ్‌ ఉద్యమాన్ని ప్రారంభించాడు. మహ్మద్‌ అలీజిన్నా తిలక్‌ యొక్క హోమ్‌రూల్‌ లీగ్‌ ఉద్యమాన్ని ఆలహాబాద్‌, లక్నో మొదలైన ప్రాంతాల్లో వ్యాప్తి చేశాడు.
•జిన్నా ముందు భారతీయులం ఆ తర్వాతే ముస్లింలము అనే నినాదాన్ని ఇచ్చాడు.
•తిలక్‌ యొక్క హోమ్‌రూల్‌ ఉద్యమం అనిబిసెంట్‌ యొక్క ఆల్‌ ఇండియా హోమ్‌రూల్‌ ఉద్యమంలో విలీనమైనది.
•1916లో లక్నో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్ సమావేశంలో తిలక్‌, జిన్నా అనిబిసెంట్‌ల ప్రయత్నాల ఫలితంగా మితవాదులు, అతివాదులు మరియు ముస్లింలీగ్‌ ఏకమైనారు.
•ఈ సమావేశానికి అధ్యక్షుడు -| ఎ.సి.మజుందార్‌ (అంబికా చరణ్‌ మజుందార్‌)
•1920లో తిలక్‌ మరణించాడు. దీంతో అతివాద ఉద్యమం కూడా అంతమైంది.
•తిలక్‌ బ్రిటీషు వారిచే రూపొందించబడిన బాల్య వివాహాల
•నిషేధ చట్టమైన Age of Consent Act ను వ్యతిరేకించి తన కుమార్తెకు బాల్య వివాహం జరిపించాడు.
•కేశవ్‌చంద్రసేన్‌ కూడా తన కుమార్తెకు బాల్య వివాహం చేశాడు. •స్టేట్‌మెంట్స్‌ : -స్వరాజ్యం నా జన్మహక్కు దానిని సాదించి తీరుతాను.
-స్వరాజ్యం ఒక మూలం. స్వదేశీ మరియు బహిష్కరణ దాని యొక్క శాఖలు.
-ఇప్పటి అతివాదులు రేపటి మితవాదులు. ఎలాగైతే ఇప్పటి మితవాదులు నిన్నటి అతివాదులో అలాగ.
-ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సంవత్సరానికి ఒకసారి కప్పలాగ అరిస్తే ఏమీ సాధించలేము.
-ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సమావేశాలను హాలిడే రిక్రియేషన్‌ అని పేర్కొన్నాడు.

హోమ్‌రూల్ ఉద్యమం 1916

• అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ ప్రతిపాదించిన జాతీయ స్వయం నిర్ణయ సూత్రం ప్రకారం భారతీయులకు కూడా తమ జాతీయ ప్రభుత్వం ఏర్పర్చుకునే హక్కు ఉందని అనిబిసెంట్, తిలక్‌లు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు.
• తిలక్ పుణే కేంద్రంగా 1916 ఏప్రిల్‌లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. దీని కోసం హోమ్‌రూల్‌లీగ్ అనే సంస్థను ప్రారంభించారు.
•తిలక్ ఉద్యమం మహారాష్ర్ట, సెంట్రల్ ప్రావిన్సులో కొనసాగింది.
• అనిబిసెంట్ మద్రాసు కేంద్రంగా 1916 సెప్టెంబర్‌లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది తిలక్ ఉద్యమ ప్రాంతాలు మినహా మొత్తం భారతదేశమంతా కొనసాగింది.
•అనిబిసెంట్ అఖిల భారత హోమ్‌రూల్ లీగ్‌ను స్థాపించారు.
•బ్రిటిష్ అధికార పరిధికి లోబడి మతస్వేచ్ఛ, జాతీయ విద్య, సాంఘిక, రాజకీయ సంస్కరణలతో భారతీయులకు స్వయం పాలన అందించడం ఈ ఉద్యమ లక్ష్యం.
•1917లో మాంటేగ్ ప్రకటనతో అనిబిసెంట్ ఉద్యమం నిలిపివేశారు. తిలక్ తన ఉద్యమాన్ని కొనసాగించారు.

అతివాద నాయకులు:

పంజాబ్‌కు చెందిన లాలా లజపతిరాయ్, మహారాష్ట్రకు చెందిన బాలగంగాధర తిలక్, బెంగాల్‌కు చెందిన బిపిన్ చంద్రపాల్ ముఖ్యమైన అతివాద నాయకులు. వీరే లాల్-బాల్-పాల్‌గా, అతివాదత్రయంగా ప్రసిద్ధిగాంచారు. వీరితోపాటు బెంగాల్‌కు చెందిన అరబిందోఘోష్ కూడా ప్రముఖ అతివాద నాయకుడు.
లాలాలజపతిరాయ్‌ :
•జననం: 28-1-1865
•మరణం: 17-11-1928
•వార్తాపత్రిక - పంజాబీ, The Pupil (ఆంగ్ల భాషలో)
•పుస్తకము - Unhappy India
•సంస్థ - Hindu Orphan Relief Organisation (హిందువుల అనాథ శరణాలయము)
•AITUC (All India Trade Union Congress) యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు - లాలాలజపతిరాయ్ (AITUC స్థాపించినవాడు -ఎన్‌.ఎం.జోషి 1920లో)
•ఆర్య సమాజ్‌ యొక్క శుద్ధి సంఘం ఉద్యమాలను పంజాబ్‌, లాహోర్‌లలో వ్యాప్తి చేశాడు.
•గవర్నర్‌ జనరల్‌ 2వ హార్డింజ్ లజపతిరాయ్‌ను అపాయకరమైన కుట్రదారుడు అని పేర్కోన్నాడు(Most Dangerous Conspirator).
•1928లో సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా లాహోర్ లో సైమన్‌ గోబ్యాక్‌ ఉద్యమాన్ని చేపట్టాడు. ఈ సందర్భంగా. లాహోర్‌ ఏసీపీ శాండర్స్‌ లజపతిరాయ్‌పై లారీచార్జీ జరిపించాడు. దీంతో గాయాలకు గురైన లజపతిరాయ్‌ మరణించాడు.
•దీనికి ప్రతీకారంగా HRA(Hindustan Republican Association) సభ్యులైన భగత్‌సింగ్‌, రాజ్‌గురు, చంద్రశేఖర్‌ ఆజాద్‌లు శాండర్స్‌ను హత్య చేశారు. దీనినే లాహోర్‌ కుట్ర అంటారు.

బిపిన్‌ చంద్రపాల్‌:
•ఇతను ఒక గొప్ప వక్త
•బ్రహ్మ సమాజ్‌ యొక్క ముఖ్య వక్తగా యూరప్‌, అమెరికాలను సందర్శించాడు.
•వందేమాతరం అనే పత్రికను ప్రచురించాడు. తరువాత ఈ పత్రికను అరబిందోఘోష్‌కు అప్పగించాడు.
•వందేమాతరం ఉద్యమాలను బి.సి.పాల్‌ బెంగాల్‌, ఆంధ్రాలలో వ్యాప్తి చేశాడు.
•ఆంధ్రాలో ఇతని ప్రసంగాలను తెలుగులో అనువదించినవారు చిలకమర్తి లక్ష్మీనరసింహం
•బిపిన్‌ చంద్రపాల్‌ను భారతదేశంలో “తీవ్రవాద ఆలోచనా ధోరణికి పితామహుడు”గా పరిగణిస్తారు.
•ఇతను “పారదర్శక్‌' అనే బెంగాలీ పత్రికను ప్రచురించాడు.
•“ది బెంగాలీ పబ్లిక్‌ ఒపినియన్‌” మరియు 'ది ట్రిట్యూన్‌” పత్రికలకు నవోయు నంపాదకుడిగా కూడా వ్యవహరించాడు.
•బిపిన్‌ చంద్రపాల్‌ నా జీవితకాలం నాటి జ్ఞాపకాలు (Memories of My Life and Time) అనే స్వీయ చరిత్రను రచించాడు.

అరబిందో ఘోష్‌:
•జననం: 13-8-1872
•మరణం: 5-12-1950
•బిరుదు - స్వామి
•వార్తాపత్రిక - వందేమాతరం ఆర్య(మాసపత్రిక)
•పుస్తకాలు
- New Lamps for the Old (ఇందులో ప్రకాశ్‌ అనే పత్రికలో ప్రచురించారు.)
- భవానీ మందిర్‌
- సావిత్రి
- Life Divine
•సంస్థ - ఆరావళి ఆశ్రమము (పాండిచ్చేరిలో)
•లండన్‌లో 14 సం॥లు గడిపిన తర్వాత 1893లో భారతదేశానికి వచ్చాడు. బెంగాల్‌లోని జాతీయ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నాడు.
•ఇతని సోదరుడు భరీంద్ర కుమార్‌ ఘోష్‌ మరియు వివేకానంద సోదరుడు భూపేంద్ర దత్త యుగాంతర్‌ అనే పత్రికను ప్రచురించాడు. వీరిరువురూ విప్లవ ఉద్యమాన్ని కూడా ప్రచారం చేశారు.
•బరీంద్రకుమార్‌ ఘోష్‌ మరియు ప్రమోద్‌మిత్రాలు కలకత్తాలో ఒక శక్తివంతమైన విప్లవ సంస్థ 'అనుశీలనా సమితి' ని స్థాపించారు.
•అరబిందోఘోష్‌ ఆలీపూర్‌ (పశ్చిమ బెంగాల్‌) కుట్రలో ఇరికించబడ్డాడు. ఈ కేసులో అరబిందోఘోష్‌ తరపున వాదించినవాడు సి.ఆర్‌.దాస్‌
•ఈ కుట్ర తర్వాత అరబిందో ఘోష్‌ దక్షిణ భారతదేశంలో పాండిచ్చేరిలో స్థిరపడ్డాడు.
•రష్యా యొక్క Passive Resistance అనే సిద్ధాంతాలను తన వందేమాతరం పత్రికలో ప్రచురించాడు (7 సార్లు).

రచనలు
1) బాలగంగాధర్ తిలక్ - ది ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద వేదాస్, గీతా రహస్యం.
2) లాలా లజపతిరాయ్ - అన్ హ్యాపీ ఇండియా, ఇంగ్లాండ్స్ డెబ్ టు ఇండియా, కాల్ టు యంగ్ ఇండియా, ఇండియాస్ విల్ టు ఫ్రీడమ్, ఏన్ ఇంటర్‌ప్రిటేషన్ అండ్ హిస్టరీ ఆఫ్ ది నేషనల్ మూవ్‌మెంట్.
3) అరబిందో ఘోష్ - ద లైఫ్ డివైన్, సావిత్రి, డాక్ట్రిన్ ఆఫ్ పాసివ్ రెసిస్టెన్స్, భవానీ మందిర్.
4) బిపిన్ చంద్రపాల్ - మెమొరీస్ ఆఫ్ మై లైఫ్ అండ్ టైమ్స్, ద సోల్ ఆఫ్ ఇండియా: ఎ కన్‌స్ట్రక్టివ్ స్టడీ ఆఫ్ ఇండియన్ థాట్స్ అండ్ ఐడియల్స్.

అతివాద యుగంలో ప్రముఖ సంఘటనలు
•1906 - కలకత్తాలో జాతీయ కళాశాల స్థాపన.
•1906 డిసెంబర్ 30న ఢాకా కేంద్రంగా నవాబ్ హబీబుల్లా అఖిల భారత ముస్లింలీగ్‌ను స్థాపించారు.
•1907 - సూరత్ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో అతివాదులు, మితవాదులుగా చీలిక. జాతీయ కాంగ్రెస్ నుంచి అతివాదుల బహిష్కరణ.
•1909 - మింటో - మార్లే సంస్కరణలు - ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు.
•1911 డిసెంబర్ 11న ఢిల్లీ దర్బార్ - బెంగాల్ పునరేకీకరణ. దేశ రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్పు. ఒడిశా, బీహార్‌లను బెంగాల్ నుంచి వేరు చేయటం.
•1912 డిసెంబర్ 23 లార్డ్ హార్డింజ్ బాంబు కేసు - నూతన రాజధాని ప్రవేశ సమయంలో ఢిల్లీలో చాందినీ చౌక్ వద్ద హార్డింజ్ హత్యకు బాంబు దాడి.
•1914-1918 - మొదటి ప్రపంచ యుద్ధం.
•1916 - లక్నో ఒప్పందం - ముస్లింలీగ్, కాంగ్రెస్‌లు ఐక్యపోరాటానికి అంగీకారం అతివాద, మితవాదుల కలయిక.
•1917 ఆగస్ట్ 20 - మాంటేగ్ ప్రకటన.
•పాలనలో భారతీయులకు ప్రాతినిధ్యం పెంచటం.
•అంచెలంచెలుగా స్వయంపాలనా సంస్థల ఏర్పాటు.
•బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు.
•1918 ఆగస్ట్ - సురేంద్ర నాథ్ బెనర్జీ నాయకత్వంలో మితవాదులు కాంగ్రెస్‌ను వీడటం. నేషనల్ లిబరల్ లీగ్ స్థాపన. ఇదే ఆల్ ఇండియా లిబరల్ ఫెడరేషన్‌గా మారింది.
•1919 - మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు- రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన ప్రవేశ పెట్టడం.

అతివాద నాయకులు

సం.

పేరు

కాలం

బిరుదులు

పత్రికలు

సంస్థలు

1. బాలగంగాధర్ తిలక్ 1856-1920 లోకమాన్య, భారత అశాంతిపిత, దేశ భక్తుల్లో రాజు మరాఠా (ఇంగ్లీష్), కేసరి (మరాఠా) హోమ్‌రూల్ లీగ్, ఫెర్గూసన్ కళాశాల
2. లాలా లజపతిరాయ్ 1865-1928 పంజాబ్ కేసరి పంజాబీ పీపుల్, వందేమాతర (ఉర్దూ) సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్స్ సొసైటీ, ఇండియన్ హోమ్ రూల్ లీగ్ (యూఎస్‌ఏ), ఇండియన్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (యూఎస్‌ఏ)
3. బిపిన్ చంద్రపాల్ 1858-1932 బెంగాల్ డాంటన్, భారత విప్లవ భావపిత పారిదర్శక్, న్యూ ఇండియా, స్వరాజ్య (లండన్), ఇండియన్ స్టూడెంట్స్(లండన్)
4.అరబిందో ఘోష్1872-1950స్వామి, యోగివందేమాతరం (పాల్‌తో కలిసి), ఆర్యఅరోవెల్లె ఆశ్రమం (పుదుచ్చేరి)

No comments:

Post a Comment

Post Bottom Ad