శివాజీ(1627-1680)
👉🏻1627లో షాజీ భోంస్లే, జిజియాబాయిలకు శివాజీ పూణేలోని శివనేర్ కోటలో జన్మించాడు👉🏻 షాజీ భోంస్లే యొక్క తండ్రి మాలోజీ అహ్మద్ నగర్ పాలకుల వద్ద సైనిక అధికారిగా పని చేశాడు. అప్పుడే మాలోజీకి పూనే జాగీర్ ఇవ్వబడింది.
👉🏻 మాలోజీ ఒక సూఫీ సన్యాసి అయిన హజరత్ షా షరీఫ్ను ఆరాధించేవాడు. అతని దీవెనల కారణంగానే మాలోజీకి ఇద్దరు కుమారులు జన్మించారు. మాలోజీ ఆ ఇద్దరు కుమారులకు షాజీ మరియు షరీఫ్ జీ అని పేర్లు పెట్టాడు.
👉🏻 మాలోజీ కుమారుడైన షాజీ భోంస్లే మొదటిగా అహ్మద్నగర్ పాలకుల వద్ద పని చేసి తరువాత బీజాపూర్ సైన్యంలో చేరాడు.
👉🏻 షాజీ భోంస్లే బీజాపూర్ అదిల్షా పాలనా కాలంలో బెంగళూరు వైశ్రాయ్గా నియమించబడ్డాడు.
👉🏻 షాజీ భోంస్లేతో పాటు జిజియాబాయి బెంగళూరుకు వచ్చుటకు నిరాకరించింది. పూణేను విడిచిపెట్టనని పట్టుబట్టింది. దీంతో షాజీ భోంస్లే జిజియాబాయి మరియు శివాజీని పూణేలోనే ఉంచి తాను బెంగళూరుకు వెళ్లిపోయాడు.
👉🏻 శివాజీ సంరక్షకుడు - దాదాజీ కొండదేవ్
👉🏻 శివాజీ మత గురువు - సమర్థ రామదాస్
👉🏻 సమర్థ రామదాసు యొక్క “దశబోధ' గ్రంథం శివాజీని ఉత్తేజపరిచింది.
👉🏻 మహారాష్ట్ర భక్తుడు తుకారాంతో శివాజీకి సన్నిహిత సంబంధం ఉంది.v శివాజీకి ఐదుగురు భార్యలు
1 సాయీ బాయి (నింబాల్కర్)
2 సోయరా బాయి
3 పుతలా బాయి
4 సఫర్ బాయి
5 కాశీ బాయి
👉🏻 1627 - శివాజీ జననం
👉🏻 1646 - శివాజీ మొదటి ఆక్రమణ “తోరణదుర్గం” (మహారాష్ట్ర) తర్వాత కందన, పురందర్ ప్రాంతాలను ఆక్రమించాడు.
👉🏻 1656 - శివాజీ మొదటి గొప్ప ఆక్రమణ-జావలీ (దీనిని పూణె పాలకుడు చంద్రరావు మోరే నుండి ఆక్రమించాడు)
👉🏻 1659 - శివాజీని బంధించుటకు బీజాపూర్ సుల్తాన్ అఫ్జల్ఖాన్ను పంపాడు. కానీ ఇతను ప్రతాప్ఘడ్ కోట వద్ద శివాజీచే చంపబడ్డాడు.
👉🏻 1660-63 - శివాజీని పట్టుకొనుటకు ఔరంగజేబు వహిస్థాఖాన్ను వంపాడు. కానీ ఇతను విఫలమయ్యాడు. బెరంగజేబు శివాజీని మౌంటెన్ ర్యాట్ అని పేర్కొన్నాడు.
👉🏻 1665 - శివాజీని పట్టుకొనుటకు ఔరంగజేబు జైసింగ్ను పంపాడు. ఇతను శివాజీని అనేక చిన్నచిన్న యుద్ధాలలో ఓడించి అతనిచే పురందర్ ఒప్పందంపై సంతకం చేయించాడు. దీనిలో అంశాలు:
1) జెరంగజేబు సైన్యంలో చేరుటకు శివాజీ అంగీకరించాడు.
2) శివాజీ 35 కోటలలో 23 కోటలు ఔరంగజేబుకు ఇచ్చుటకు అంగీకరించాడు.
3) కరెన్సీ(హన్స్) లేదా నష్టపరిహారం చెల్లించుటకు శివాజీ అంగీకరించాడు.
👉🏻 1666 - ఔరంగజేబును కలుసుకొనుటకు శివాజీ ఆగ్రా వెళ్లాడు. కానీ తనకు తక్కువ మన్సబ్దారీ ర్యాంక్ ఇచ్చుటను అవమానకరంగా భావించి శివాజీ ఔరంగజేబును దూషించాడు. దీంతో శివాజీ ఆగ్రా కోటలో బంధించబడ్డాడు.
👉🏻 రోషనారా సహాయంతో శివాజీ ఒక బిచ్చగాడు వేషం వేసుకొని కోట నుండి తప్పించుకున్నాడు.
👉🏻 తరువాత తాను పోగొట్టుకున్న కోటలను తిరిగి ఆక్రమించుట ప్రారంభించాడు.
👉🏻 1672 - సూరత్ను కొల్లగొట్టాడు
👉🏻 1674 - మహారాష్ట్రలోని రాయగఢ్లో శివాజీ పట్టాభిషేకం చేయించుకున్నాడు. (శివాజీ రాజధాని-రాయ్గఢ్) గాగాభట్ శివాజీకి పట్టాభిషేకం చేశాడు.
👉🏻 ఈ సందర్భంగా శివాజీ “ఛత్రపతి” బిరుదు పొందాడు.
👉🏻 ఈ పట్టాభిషేకానికి హాజరైన ఆంగ్లేయుడు -ఆక్సెన్దెన్
👉🏻 శివాజీని హైందవ ధర్మోద్ధారక(హిందుత్వ రక్షకుడు) అని కూడా అంటారు.
👉🏻 1676 - శివాజీ మరియు హసన్ తానీషా మధ్య గోల్కొండ ఒప్పందం జరిగింది.
👉🏻 1680లో శివాజీ మరణం
👉🏻 1674-80 మధ్య కాలంలో శివాజీ పరిపాలనపై దృష్టి సారించాడుv అష్టప్రధానులు అనే మంత్రిత్వశాఖను ఏర్పాటు చేశాడు
👉🏻 అష్ట ప్రధానులలో ముఖ్యమైనవాడు - పీష్వా
👉🏻 చౌత్(1/4), సర్ధేశ్ముఖి(1/10) అనే పన్నులను వసూలు చేశాడు.
👉🏻 చౌత్ పన్నును ఇతను గ్రామాలపై దాడి చేయకుండా ఉండటానికి వసూలు చేసేవాడు.
👉🏻 సర్దేశ్ముఖి పన్నును ఇతరులు ఆ గ్రామాలపై దాడి చేయకుండా రక్షణ కల్పించుటకు వసూలు చేశాడు.
👉🏻 ఎం.జి.రనడే శివాజీ యొక్క చౌత్, సర్దేశ్ముఖి పన్నులను బ్రిటిష్ యొక్క సైనిక సహకార విధానంతో పోల్చాడు.
శివాజీ పరిపాలన:
👉🏻శివాజీ రాజ్యానికి స్వరాజ్యమని పేరు
👉🏻 కేంద్ర ప్రభుత్వంలో రాజు, అష్ట ప్రధాన్లు ఉండేవారు
1. పీష్వా లేదా ముఖ్య ప్రధాన్ -ప్రధాని
2. అమాత్య లేదా మజుందార్ -ఆర్థికమంత్రి
3. సుమంత/దాబీర్ -విదేశాంగమంత్రి
4. మంత్రి/వాకియానావిస్ -నిఘా, స్వదేశీ వ్యవహారాలు (హోంమంత్రి)
5. సచివ్/సుర్నవిష్ -లేఖల సూపరిండెంట్ / ఉత్తర ప్రత్యుత్తరాలు
6. సేనాపతి/సారినోబత్ -సైన్యాధిపతి
7. సదర్/పండిత్రావు -మతాధిపతి
8. న్యాయాదీష్ -న్యాయమూర్తి
👉🏻రాజ్యం 4 రాష్రాలు/సుబాలుగా విభజన చేయబడింది. సుభాకు అధిపతి సుబేదార్/మమ్లత్దార్
👉🏻సుభా పరగణగా, పరగణ తరఫ్గా, తరఫ్ మౌజాగా విభజించబడ్డాయి.
👉🏻జీతాలకు బదులుగా భూమి పన్ను వసూలు హక్కు కల్పించడాన్ని సరంజామి విధానం అంటారు.
👉🏻వీరి కాలంలో గ్రామాధికారులను పటేల్, ముఖ్య, కులకర్ణి అని పిలిచేవారు.
👉🏻ఇతను గ్రామాల్లో బారాబలుతాదార్ (12 అయ్యగార్లు) విధానం ప్రవేశపెట్టారు.
👉🏻భూమిశిస్తు 2/5 వంతు నిర్ణయించబడింది
👉🏻శివాజీ 200 యుద్ధ నౌకలు, 80 ఫిరంగులు ఉండేవి. నౌకాదళం 'కొలాబా'లో ఉండేది.
👉🏻మధ్య యుగంలో నౌకాదళ నిర్మాణపు అవసరాన్ని గుర్తించిన మొదటి భారతీయ పాలకుడు శివాజీ అని ఎ. ఎల్.శ్రీవాస్తవ పేర్కొన్నాడు.
1680-89 (శంభాజీ పాలన):
👉🏻ఔరంగజేబు కుమారుడు అక్బర్ తిరుగుబాటు చేసినపుడు ఇతీను అక్బర్ కు ఆశ్రయం కల్పించాడు.
👉🏻సంగమేశ్వర్ యుధ్ధంలో ఇతను మొగల్ సేనాని ముకారిబ్ఖాన్చే చంపబడ్డాడు.
👉🏻ఇతని కుమారుడు షాహు ఔరంగజేబు ఆస్థానంలో బంధించబడ్డాడు.
👉🏻ఔరంగజేబు కుమార్తె జెబురున్నీసా షాహుకు విద్యను బోధించింది.
1689-1700 (రాజారామ్ పాలన):
👉🏻ఇతను షాహూ చెప్పులను సింహాసనంపై పెట్టి పాలించేవాడు.
👉🏻ఇతను “ప్రతినిధి అనే పదవిని సృష్టించాడు.
👉🏻మొదటి ప్రతినిధి -ప్రవ్లాద్ నిరాజ్
👉🏻ఇతను రాజధానిని సతారాకు మార్చాడు
👉🏻ఇతని భార్య తారాబాయి
1700-1708 (3వ శివాజీ పాలన/తారాబాయి యుగం):
👉🏻ఈ మధ్యకాలంలో తారాబాయి 3వ శివాజీ యొక్క సంరక్షకురాలుగా ఉంటూ మరాఠా రాజ్యంను పాలించింది.
👉🏻1708లో షాహూ, ఏసూబాయి(తల్లి) చేతిలో ఖేద్ వద్ద పరాజయం పాలై తారాబాయి కొల్దాపూర్లో స్థిరపడింది. (వార్నా ఒప్పందం ప్రకారం తారాబాయి కొల్హాపూర్లో స్వతంత్ర పాలన చేసింది)
1708-49 (షాహూ పాలన):
👉🏻షాహూకు విద్య కల్పించినది - జెబురున్నీసా (ఔరంగజేబ్ కుమార్తె)
👉🏻1707లో ఔరంగజేబు మరణానంతరం అతని కుమారుడు ఆజమ్షా/1వ బహదుర్షా షాహును విడుదల చేశాడు.
👉🏻షాహు పట్టాభిషేకం సతారా వద్ద జరిగింది.
👉🏻ఇతని కాలంలో బాలాజీ విశ్వనాథ్ పీష్వాగా నియమించబడ్డాడు.
👉🏻ఇతని కాలం నుండి మరాఠా రాజుల ప్రాధాన్యం తగ్గి పీష్వాల ఆధిపత్యం ప్రారంభమైంది.
రాంరాజా(1749-80 దశకం) :
👉🏻ఇతను సంఘోలా ఒప్పందం ప్రకారం రాజు అయ్యాడు. కానీ పెద్దగా గుర్తింపులేదు.
👉🏻పీష్వాలు మొత్తం పాలనను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
పీష్వాలు:
1) బాలాజీ విశ్వనాథ్ (1712-20):
👉🏻బిరుదు - సేనకర్తే (చంద్రసేన్ జాదవ్ ఈ బిరుదు ఇచ్చాడు)
👉🏻పీష్వా పదవిలో వారసత్వమును ప్రవేశపెట్టాడు.
👉🏻పీష్వా పదవిని అతి ముఖ్యమైన, శక్తివంతమైనదిగా రూపొందించాడు.
👉🏻అసమానమైన సేవకుడు, మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపకుడు.
👉🏻ఫరూక్ సియర్ను సింహాసనష్టుడిని చేసి మహారాష్ట్రుల ప్రభావం దక్కన్ అంతా వ్యాప్తి చెందించడం ఈయన పాలనలో ముఖ్య విషయం.
2) 1వ బాజీరావు(1720-40):
👉🏻ఇతను అతిగొప్ప పీష్వా
👉🏻హిందూ పద్ పద్ షాహీ సిద్ధాంతంను పేర్కొన్నాడు.
👉🏻ఇతని కాలంలో హైదరాబాద్ నవాబు నిజాం-ఉల్-ముల్క్ అసఫ్జాహీ రాజ్యాన్ని స్థాపించాడు.
👉🏻ఇతను నిజాం-ఉల్-ముల్క్ను ఫల్ఖేడ్ యుద్ధంలో ఓడించి ముంగి షివ్గామ్ అనే ఒప్పందం ప్రకారం చౌత్, సర్దేశ్ముఖి పన్నులను వసూలు చేసుకొనుటకు హక్కులు పొందాడు.
👉🏻శివాజీ తరువాత గెరిల్లా వ్యూహాలకు అతిగొప్ప నాయకుడు. ఇతడు పీష్వాలందరిలోకి గొప్పవాడు.
👉🏻ఇతన్ని రణవీరుడైన పీష్వా, మూర్తీభవించిన హిందూశక్తిగా పేర్కొన్నారు.
👉🏻మహారాష్ట్రుల అధికారాన్ని ఉత్తర భారత్లో స్థాపించాడు. హిందు పద్ పాదుషాహీ లేదా అఖిల భారత సామ్రాజ్య స్థాపన ఇతని మహోన్నత ఆశయం.
3) బాలాజీ బాజీరావు(1740-61):
👉🏻ఇతనిని నానాసాహెబ్ అని కూడా పిలిచేవారు
👉🏻1751లో ఒరిస్సాను బెంగాల్ పాలకుడు అలీ వర్దిఖాన్ నుండి పొందాడు.
👉🏻ఇతని కాలంలో 1761లో ఆఫ్ఘన్ దండయాత్రికుడు అహ్మద్షా అబ్దాలీ మరాఠా జనరల్స్ అయిన సదాశివరావు, విశ్వారావు భావేలను ఓడించాడు.
👉🏻ఈ వార్త విన్న బాలాజీ విశ్వనాథ్ అనారోగ్యానికి గురై మరణించాడు.
1వ మాధవరావు(1761-73):
👉🏻ఇతను అలహాబాద్లో బందీగా ఉన్న మలి మొగల్ చక్రవర్తి 2వ షాలంను ఢిల్లీకి తిరిగి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించాడు.
No comments:
Post a Comment