ఢిల్లీ సుల్తానులు (1206 - 1526) - GNANA SAMHITHA

Breaking

Post Top Ad

Thursday, March 20, 2025

ఢిల్లీ సుల్తానులు (1206 - 1526)

        క్రీ.శ.1206లో మహ్మద్‌ఘోరీ మరణానంతరం కుతుబుద్దీన్‌ ఐబక్‌ ఢిల్లీ సుల్తాన్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ తర్వాత క్రీ.శ.1526 వరకు అంటే సుమారు మూడు శతాబ్దాల పాటు ఢిల్లీ కేంద్రంగా బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాలు పరిపాలించాయి. వీరు సువిశాల సామ్రాజ్య స్థాపనతోపాటు ఆర్థిక, సాంఘిక అభివృద్ధికి, సాంస్కృతిక వికాసానికి కృషి చేశారు.
1) బానిస వంశము: 1206-1290
2) ఖిల్జీ వంశము : 1290-1320
3) తుగ్లక్‌ వంశము : 1820-1415
4) సయ్యద్‌ వంశము : 1415-1451
5) లోడీ వంశము : 1451-1526

బానిస వంశము: 1206-1290

👉🏻బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్‌ ఐబక్‌.
👉🏻ఇతడు క్రీ.శ.1206లో తన యజమాని మహ్మద్‌ఘోరీకి వారసులు లేకపోవడం వల్ల తన స్వాతంత్య్రాన్ని భారతదేశంలో ప్రకటించుకొని క్రీ.శ.1210 వరకు పరిపాలించాడు.
👉🏻ఇతడి వారసుల్లో ఇల్‌టుట్‌మిష్, రజియా సుల్తానా, ఘియాజుద్దీన్‌ బాల్బన్‌ ప్రముఖులు.
👉🏻ఈ వంశాన్నే మామ్లూక్‌ వంశంగా పేర్కొంటారు. వీరు 1206 నుంచి 1290 మధ్య పరిపాలించారు.

కుతుబుద్దీన్‌ ఐబక్‌
👉🏻బానిసగా జీవితాన్ని ప్రారంభించిన ఐబక్‌ తన శక్తి సామర్థ్యాలతో ఘోరీ మహ్మద్‌ సేనానిగా ఎదిగాడు.
👉🏻తరైన్‌ యుద్ధాలు, ఘోరీ భారతదేశ దండయాత్రల్లో పాల్గొన్న ఐబక్, భారతదేశంలో ఘోరీ ప్రతినిధిగా నియమితుడయ్యాడు.
👉🏻ఢిల్లీని ఆక్రమించుకున్నందుకు గుర్తుగా ‘కువ్వత్‌-ఉల్‌-ఇస్లామ్‌’ అనే మసీదును నిర్మించాడు.
👉🏻ఘోరీ మరణానంతరం క్రీ.శ. 1206లో ఐబక్‌ స్వతంత్ర ఢిల్లీ సుల్తాన్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
👉🏻అతడి అధికారాన్ని ధిక్కరించి తిరుగుబాటు చేసిన బెంగాల్‌ పాలకుడు అలీమర్థాన్‌ను అణచివేసి ఆయన స్థానంలో మహ్మద్‌ షెరాన్‌ను గవర్నర్‌గా నియమించాడు.
👉🏻ఘజనీ పాలకుడైన తాజ్‌-ఉద్దీన్‌-యల్‌డజ్‌ ఢిల్లీపై దండెత్తగా అతడిని ఓడించాడు.
👉🏻అజ్మీర్‌లో ‘అర్హిదిన్‌ కా జోంప్రా’ అనే మసీదును నిర్మించాడు.
👉🏻లాహోర్‌ను రాజధానిగా చేసుకుని పాలించాడు.
👉🏻తన రెండో రాజధానిగా ఢిల్లీని ప్రకటించాడు (ఢిల్లీని పూర్తి రాజధానిగా చేసింది ఇల్‌టుట్‌మిష్‌).
👉🏻తన సూఫీ గురువు 'కుతుబ్‌-ఉద్దీన్‌ భక్తియార్‌ కాకీ జ్ఞాపకార్థం “కుతుబ్‌మినార్‌” నిర్మాణమును చేపట్టాడు.
👉🏻ఐబక్‌ తన దానగుణం వల్ల లాక్‌భక్ష్గా పిలవబడ్డాడు.
👉🏻ఇతని ఆస్థానంలోని హసన్‌ నిజామీ 'తాజుల్‌మజర్‌' అనే పుస్తకాన్ని రచించాడు.
👉🏻ఇతడు 1210లో లాహోర్‌లో చౌగాన్‌ (పోలో) ఆడుతూ గుర్రంపై నుంచి పడి మరణించాడు.
👉🏻అనంతరం అతడి కుమారుడు ఆరామ్‌షా (ఆరామ్‌భక్ష్) పాలకుడయ్యాడు.

ఇల్‌టుట్‌మిష్‌ (క్రీ.శ.1211 - 1236)
👉🏻ఆరామ్‌షాను పదవి నుంచి తొలగించి ఇల్‌టుట్‌మిష్‌ క్రీ.శ.1211లో సుల్తాన్‌ పదవిని చేపట్టాడు.
👉🏻ఇతడు ఐబక్‌ అల్లుడు.
👉🏻ఇతడు ఐబక్‌ మరణించే నాటికి బదౌన్ ప్రాంత గవర్నర్‌గా ఉన్నాడు.
👉🏻ఇల్‌టుట్‌మిష్‌ ఇల్బారీ తెగకు చెందినవాడు.
👉🏻అసలు పేరు ష్‌మ్స్‌ - ఉద్దీన్‌ - ఇల్‌టుట్‌మిష్‌.
👉🏻ఖలీఫా నుంచి భారతదేశ సుల్తాన్‌గా అనుమతి పత్రం పొందిన తొలి ఢిల్లీ సుల్తాన్‌ ఇతడే.
👉🏻ఢిల్లీని శాశ్వత రాజధానిగా చేసుకుని పరిపాలించాడు.
👉🏻ఘజనీ పాలకుడు తాజ్‌వుద్దీన్‌ యల్‌డజ్‌ను, ముల్తాన్‌ పాలకుడు నాసిరుద్దీన్‌ కుబాచాను ఓడించాడు. విశాల సామ్రాజ్య స్థాపన చేశాడు.
👉🏻చెంఘీజ్‌ఖాన్‌ నాయకత్వంలోని మంగోలుల దాడులను సమర్థంగా తిప్పికొట్టాడు.
👉🏻ఇతడి కాలంలోనే 40 మంది తురుష్క సర్దారుల కూటమి చిహల్‌గనీ ఏర్పడింది.
👉🏻ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్‌ సామ్రాజ్యంలో ‘ఇక్తా’ (సైనిక అధికారులకు జీతాలకు బదులుగా భూమి ఇచ్చుట) అనే సైనిక విధానాన్ని ప్రవేశపెట్టాడు.
👉🏻నాటి సైనిక రాష్ట్రాలను ఇక్తాలు, వాటి అధిపతిని ముక్తీ అని పిలిచేవారు.
👉🏻ఇతడు ఢిల్లీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా ‘హౌజ్‌-ఇ-సుల్తానీ’ అనే రాజుల స్నాన ఘట్టాన్ని నిర్మించాడు.
👉🏻ఐబక్‌ ప్రారంభించిన కుతుబ్‌మీనార్‌ నిర్మాణాన్ని పూర్తిచేశాడు.
👉🏻టంకా అనే వెండి నాణేలు, జితాల్‌ అనే రాగి నాణేలను ముద్రించాడు.
👉🏻ఇతడికి గల పరమత ద్వేషం వల్ల భిల్సా, ఉజ్జయిని దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి.
👉🏻ప్రముఖ చరిత్రకారుడు ఆర్‌.పి.త్రిపాఠీ ప్రకారం భారతదేశంలో ముస్లిం సార్వభౌమాధికారాన్ని నెలకొల్పినవారు ఇల్‌టుట్‌మిష్‌.
👉🏻తన ఆస్థానంలో మిన్హజ్‌-ఉస్‌-సిరాజ్‌ (మిన్హజుద్దీన్‌ షిరాజ్‌), తాజుద్దీన్‌ లాంటి కవులను పోషించాడు.
👉🏻మిన్హాజుల్‌ సిరాజ్‌ “తబాకత్‌ నజరీ అనే పుస్తకాన్ని రచించాడు. ఈ పుస్తకంలో ప్రధానంగా రజియా స్తుల్తానా గురించి పేర్కొనబడింది.
👉🏻తన కుమారుడు నజీరుద్దీన్‌ మొహమ్మద్‌ మరణించడంతో అతని జ్ఞాపకార్థం 'సుల్తాన్‌ ఘరీ అనే సమాధిని (ఢిల్లీలో) నిర్మించాడు. అందువల్లనే ఇల్‌టుట్‌మిష్‌ను “సమాధుల పితామహుడు” అంటారు.
👉🏻1228లో 3వ తరాయిన్‌ యుద్ధంలో గజినీ పాలకుడు యాల్డాజ్‌ను ఓడించాడు.

సుల్తానా రజియా (క్రీ.శ.1236 - 1240)
👉🏻భారతదేశాన్ని పరిపాలించిన తొలి, ఏకైక ముస్లిం మహిళ రజియా సుల్తానా.
👉🏻ఈమె ఇల్‌టుట్‌మిష్‌ కుమార్తె.
👉🏻రజియా శక్తి సామర్థ్యాలను గమనించిన ఇల్‌టుట్‌మిష్‌ తన కుమారులను (మహ్మద్, రక్నుద్దీన్‌) కాదని ఈమెను వారసురాలిగా ప్రకటించాడు.
👉🏻అయితే ఒక మహిళ పాలకురాలు కావడం ఇష్టం లేని ఆస్థాన సర్దారులు, సామంతులు ఆమెపై అనేక తిరుగుబాట్లు చేశారు.
👉🏻లాహోర్, ముల్తాన్‌ పాలకులు చేసిన తిరుగుబాట్లను రజియా సమర్థంగా అణచివేసింది.
👉🏻మాలిక్‌ జమాలుద్దీన్‌ యాకూత్‌ అనే అబిసీనియా దేశస్థుడిని అశ్వదళాధిపతి (అమీర్‌- ఇ- అబూఖత్‌)గా నియమించింది.
👉🏻ఈ నియామకం స్వదేశీ ముస్లింలు, సర్దారుల్లో మరింత ద్వేషాన్ని పెంచింది.
👉🏻రజియా యొక్క సర్దార్‌ నిజామ్‌-ఉల్‌-జునైడీ భటిండా పాలకుడు అల్‌తునియాతో చేరి ఆమెను ఓడించి భటిండా కారాగారంలో బంధించారు.
👉🏻కానీ అవసరం తీరిన జునైడీ అల్‌తునియాను మోసం చేయడంతో అల్‌తునియా భటిండా కారాగారం నుంచి ఆమెను విడిపించి, వివాహం చేసుకుని ఇద్దరూ ఢిల్లీపైకి వస్తుండగా క్రీ.శ.1240లో ఖైతాల్‌ అనే ప్రాంతంలో హత్యకు గురయ్యారు. ఫలితంగా ఢిల్లీ సుల్తాన్‌ సామ్రాజ్యంలో సుల్తానా రజియా శకం ముగిసింది.
👉🏻ఈమె తర్వాత పాలకులు
1) బహరంషా
2) అల్లావుద్దీన్‌ మసూద్‌
3) నజీరుద్దీన్‌ మహమ్మద్‌
👉🏻నజీరుద్దీన్‌ మొహమ్మద్‌ యొక్క ప్రధాన మంత్రి -బాల్బన్‌
👉🏻బాల్బన్‌ యొక్క వ్యతిరేకి -ఇమాదుద్దీన్‌ రెహాన్‌
👉🏻1226లో బాల్బన్‌ తన అల్లుడు మరియు పాలకుడైన నజీరుద్దీన్‌ మొహమ్మద్‌కు విషం ఇచ్చి హతమార్చాడు.

ఘియాజుద్దీన్‌ బాల్బన్‌ (క్రీ.శ.1266 - 1287)
👉🏻బానిసవంశ పాలకుల్లో గొప్పవాడు బాల్బన్‌.
👉🏻ఇతడు బానిసగా, తోటమాలిగా, నీరు మోసేవాడిగా, సేనానిగా, సర్దార్‌గా చివరకు సుల్తాన్‌గా అనేక పాత్రలను పోషించాడు.
👉🏻బానిసగా భారతదేశానికి వచ్చిన బాల్బన్‌ ఇల్‌టుట్‌మిష్‌ కొలువులో చేరి చిహల్‌గనీ కూటమిలో ప్రధానపాత్ర పోషించాడు.
👉🏻తన శక్తి సామర్థ్యాల ద్వారా ఖాస్‌దార్, అమీర్‌-ఇ-షకార్‌ లాంటి పదవులను పొందాడు.
👉🏻రజియా సుల్తానా మరణానంతరం బహరాంషా, మసూద్‌షా, నాసిరుద్దీన్‌ల పాలనాకాలంలో బాల్బన్‌ కీలకపాత్ర పోషించాడు. వారి నుంచి రేవరి, హాన్సీ లాంటి జాగీర్‌లను పొందాడు.
👉🏻నాసిరుద్దీన్‌ తన కుమార్తెను బాల్బన్‌కు ఇచ్చి వివాహం చేయడమే కాకుండా నాయబ్‌-ఐ-మీ మాలిక్‌ (ఉపప్రధాని)గా నియమించాడు.
👉🏻1266లో నాసిరుద్దీన్‌ మరణించగా బాల్బన్‌ ఢిల్లీ సుల్తాన్‌ పదవిని చేపట్టాడు. బాల్బన్‌ అనేక విజయాలు సాధించాడు.
👉🏻పాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు.
👉🏻మంగోలుల దండయాత్రను సమర్థంగా తిప్పికొట్డాడు.
👉🏻అనేక పర్షియా రాచరిక విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టాడు.
👉🏻చిహల్‌గనీ కూటమిని నిర్మూలించి రాజ్యంలో శాంతిభద్రతలు నెలకొల్పాడు.
👉🏻బెంగాల్‌ గవర్నర్‌ టుగ్రిల్‌కాన్‌ తిరుగుబాటును అణచివేశాడు.
👉🏻చిహల్‌గనీ ముఠా నాయకుడు అమీర్‌ఖాన్‌ను హత్య చేయించాడు.
👉🏻రాచరికం దైవదత్తం (జిల్లీ - ఇల్లాహే/రాజు భగవంతుడి నీడ) అనే సిద్ధాంతాన్ని బాల్బన్‌ విశ్వసించాడు.
👉🏻సామాన్య ప్రజలతో మాట్లాడటానికి ఇష్టపడేవాడు కాదు.
👉🏻సుల్తాన్‌ అధికారాన్ని పెంచడానికి అనేక పర్షియన్‌ రాచరిక విధానాలను భారతదేశంలో ప్రవేశపెట్టాడు. వాటిలో ప్రధానమైనవి సిజ్ధా, ఫైబోస్‌/జమ్నిబోస్‌. సుల్తాన్‌ ఆస్థానంలోనికి వచ్చినవారెవరైనా అతడికి సాష్టాంగ నమస్కారం చేయాలన్నదే సిజ్ధా అర్థం. అలాగే సుల్తాన్‌ పాదాలను లేదా సింహాసనాన్ని ముద్దుపెట్టుకోవాలన్నది ఫైబోస్‌/జమ్నిబోస్‌ అర్థం.
👉🏻బాల్బన్‌ నిరంకుశ భావాలతో పరిపాలన చేశాడు.
👉🏻దివాన్‌-ఇ-అర్జ్‌ అనే ప్రత్యేక యుద్ధ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఇమాద్‌-ఉల్‌ ముల్క్‌ను అధిపతిగా నియమించాడు.
👉🏻సైనిక వ్యవస్థలో వృద్ధాప్య పెన్షన్‌ విధానాన్ని ప్రవేశపెట్టాడు.
👉🏻అడువులను నరికించి, వ్యవసాయ భూములుగా మార్చిన తొలి ఢిల్లీ సుల్తాన్‌గా కీర్తించబడ్డాడు.
👉🏻మంగోలుల దండయాత్రలను ఎదుర్కోవడానికి రక్షణ ఏర్పాట్లు చేశాడు.
👉🏻లాహోర్‌ కోటను సందర్శించి దానికి మరమ్మతులు చేయించాడు.
👉🏻మంగోలుల దండయాత్రల వల్ల బాల్బన్‌ పెద్ద కుమారుడు మహ్మద్‌ మరణించాడు.
👉🏻బాల్బన్‌ అనంతరం అతడి మనుమడైన కైకూబాద్‌ చివరి బానిస సుల్తాన్‌గా పరిపాలించాడు.
👉🏻వాయువ్య భారతదేశంలోని మంగోలు దండయాత్రను సమర్ధవంతంగా తిప్పికొట్టాడు.
👉🏻తన కుమారుడు మొహమ్మద్‌ వాయువ్య భారతదేశంలోని తామర్‌ మంగోల్‌ దండయాత్రను 1285లో త్రిప్పికొట్టాడు. కానీ గాయాలకు గురైన ప్రిన్స్‌ మొహ్మద్‌ మరణించాడు.
👉🏻బాల్బన్‌ మొహమ్మద్‌కు “ఖాన్‌-ఇ-షహీద్‌” అనే బిరుదును ఇచ్చాడు.
👉🏻బాల్బన్‌ అనారోగ్యానికి గురై 1286లో మరణించాడు.
* బాల్బన్‌ ఒక బానిసగా, నీటి సంచులు మోసే కూలీగా, వేటాధికారిగా, సేనాధిపతిగా, రాజనీతిజ్ఞుడిగా, చివరికి సుల్తాన్‌గా ఎదిగాడు’’ - ప్రముఖ చరిత్రకారుడు లేన్‌పూలే

కైకూబాద్‌
👉🏻బాల్బన్‌ మరణానంతరం అతని మనవడు కైకూబాద్‌ ఢిల్లీ సుల్తాన్ గా ప్రకటించబడ్దాడు.
👉🏻అప్పటి కులీనీలలో గొప్పవాడైన జలాలుద్దీన్‌ ఖిల్టీ, కైకూబాద్‌ మరియు కైమూర్‌లను హతమార్చి 1290లో ఢిల్లీ పై ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. దీనినే ఖిల్జీ విప్లవం అంటారు.


ఖిల్జీ వంశము : 1290-1320

        క్రీ.శ. 1206లో కుతుబుద్దీన్‌ ఐబక్‌ ఢిల్లీ సుల్తాన్‌ సామ్రాజ్యాన్ని స్థాపించాక బానిస, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాలు దాదాపు మూడు శతాబ్దాల పాటు భారతదేశాన్ని పరిపాలించాయి. బానిస వంశం క్రీ.శ. 1290 వరకు పాలించింది. తర్వాత ఖీల్జీ వంశ పాలనను జలాలుద్దీన్‌ ఖీల్జీ ప్రారంభించాడు. ఖిల్జీ వంశ పాలకుల్లోనే కాకుండా ఢిల్లీ సుల్తానుల్లో గొప్పవాడు అల్లావుద్దీన్‌ ఖిల్జీ.

జలాలుద్దీన్‌ ఖిల్జీ

ఈయన క్రీ.శ.1290లో చివరి బానిస వంశ పాలకుడైన కైకూబాద్‌ను తొలగించి ఖిల్జీ వంశ పాలనను ప్రారంభించాడు.
అత్యంత వృద్ధుడైన దిల్లీ సుల్తాన్‌గా పేరుగాంచాడు.
మాలిక్‌చజ్జూ లాంటి తిరుగుబాటుదారులను అణచి శాంతిభద్రతలను నెలకొల్పాడు. కానీ అనంతరకాలంలో తిరుగుబాట్లు చెలరేగాయి.
జలాలుద్దీన్‌ ఖిల్జీ మంగోలు రాజు ఉలూగ్‌ఖాన్‌కు తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించాడు.
ఇతని కాలంలో 'సిద్దిమౌలా” అనే గురువు ఏనుగుచే తొక్కించబడి చంపబడ్డాడు.
అల్లావుద్దీన్‌ ఖిల్జీని కారా, మాణిక్‌పూర్‌ ప్రాంతాలకు గవర్నర్‌గా నియమించాడు. లొంగిపోయిన మంగోలులు ఇతడి కాలంలోనే ‘నయా ముస్లింలు’గా అవతరించారు.
అల్లావుద్దీన్‌ ఖిల్జీ యాదవ రాజ్యంపై విజయం సాధించినందుకు అభినందించడానికి వెళుతుండగా జలాలుద్దీన్‌ ఖిల్జీ హత్యకు గురయ్యాడు.

అల్లావుద్దీన్‌ ఖిల్జీ (క్రీ.శ.1296 - 1316)

ఇతడి అసలు పేరు అలీ గుర్ష్షాస్ప్‌.
ఇతను జలాలుద్దీన్ ఖిల్జీ యొక్క మేనల్లుడు.
ఇతను మొత్తం ఢిల్లీ సుల్తానులలో గొప్పవాడు.
జలాలుద్దీన్‌ కాలంలో ఇతడు ‘కారా’ ప్రాంత గవర్నర్‌గా పనిచేశాడు.
1293లో యాదవ రాజ్యంపై దాడిచేసి దాని పాలకుడైన రామచంద్ర దేవుడిని ఓడించి అపార ధనరాశులను కొల్లగొట్టాడు.
తనను అభినందించడానికి వచ్చిన జలాలుద్దీన్‌ ఖిల్జీని హత్య చేయించి 1296లో ఢిల్లీ సుల్తానత్‌ పదవిని చేపట్టాడు.
అనేక విజయాలు సాధించి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాకుండా తన మార్కెట్, సైనిక, రెవెన్యూ సంస్కరణల ద్వారా ప్రసిద్ధి పొందాడు.
అల్లావుద్దీన్‌ ఖిల్జీ విజయాలను ఉత్తర భారతదేశ, దక్షిణ భారతదేశ దండయాత్రలుగా వివరించవచ్చు.
‘అల్లావుద్దీన్‌ ఖిల్జీ మార్కెట్‌ సంస్కరణలు మధ్యయుగ చరిత్రలో ఒక అద్భుత ప్రయోగం’ - ఆధునిక చరిత్రకారుడు డి.ఎన్‌.డే

ఉత్తర భారతదేశ దండయాత్రలు
👉🏻మొదట ఉత్తర భారతదేశంపై దండెత్తి గుజరాత్, రణతంభోర్, చిత్తోడ్, మాల్వా లాంటి అనేక రాజ్యాలను జయించాడు.
👉🏻1297లో నస్రత్‌ఖాన్, ఉలూగ్‌ఖాన్‌ సేనానుల నాయకత్వంలో సైన్యాన్ని పంపి గుజరాత్‌ పాలకుడైన కర్ణదేవుడిని ఓడించాడు.
👉🏻కర్ణదేవుడు తన కుమార్తె దేవలదేవితో యాదవ రాజ్యానికి పారిపోగా, అతడి భార్య కమలాదేవిని అల్లావుద్దీన్‌ ఖిల్జీ తన భార్యగా చేసుకున్నాడు.
👉🏻ఈ గుజరాత్‌ దండయాత్ర నుంచే మాలిక్‌ కపూర్‌ అనే వ్యక్తిని తీసుకువచ్చాడు.
👉🏻క్రీ.శ.1298 - 1301 మధ్య రణతంభోర్‌ రాజ్యంపై దండెత్తి పాలకుడైన హంవీందేవుడిని ఓడించాడు.
👉🏻క్రీ.శ.1302 - 1303 మధ్య చిత్తోడ్‌ రాజ్యంపై దాడి చేశాడు. చిత్తోడ్‌ రాజు రాణా రతన్‌సింగ్‌ భార్య పద్మావతిని పొందాలనే ఉద్దేశంతో ఈ దండయాత్ర చేసినట్లు చరిత్రకారులు పేర్కొన్నారు. రతన్‌సింగ్‌ మరణించడంతో రాణి పద్మిని అంతఃపుర స్త్రీలతో కలిసి అగ్నిలోకి దూకి ఆత్మహత్య (జౌహార్) చేసుకుంది. ఈ మొత్తం కథను మాలిక్‌ మహమ్మద్‌ జయసి అనే కవి పద్మావత్‌ (పద్మదత్) అనే గ్రంథంగా రాశాడు. చిత్తోడ్‌ను ఆక్రమించిన అల్లావుద్దీన్‌ ఖిల్జీ దానికి ఖజీరాబాద్‌ అనే పేరు పెట్టాడు.
👉🏻1305 నాటికి మాల్వా, ఉజ్జయిని, మాండు, ఛందేరి లాంటి రాజ్యాలను ఆక్రమించాడు.

దక్షిణ భారతదేశ దండయాత్రలు
👉🏻అల్లావుద్దీన్‌ ఖిల్జీ తన సేనాని మాలిక్‌ కపూర్‌ (మాలిక్‌ కాఫర్)‌ నాయకత్వంలో దక్షిణ భారతదేశంపై దండెత్తి యాదవ, కాకతీయ, హోయసాల, పాండ్య రాజ్యాలను ఓడించి కప్పం వసూలు చేశాడు.
👉🏻దేవగిరిని రాజధానిగా చేసుకుని పాలిస్తున్న యాదవరాజు రామచంద్ర దేవుడిని, అతడి కుమారుడు శంకర దేవుడిని ఓడించి కప్పం వసూలు చేశాడు.
👉🏻ఓరుగల్లును రాజధానిగా చేసుకుని పాలిస్తున్న కాకతీయ చక్రవర్తి రెండో ప్రతాపరుద్రుడిని ఓడించాడు.
👉🏻నాటి హోయసాల రాజు మూడో భల్లాలుడిని కూడా ఓడించాడు.
👉🏻మాలిక్‌ కపూర్‌ నాటి పాండ్యరాజు వీర పాండ్యుడిని ఓడించి, అతడి సోదరుడు సుందర పాండ్యుడిని రాజును చేసి అపార ధనరాశులను పొందాడు.
👉🏻నాడు హోయసాలులు ద్వారసముద్రం, పాండ్యులు మధురైలను రాజధానులుగా చేసుకుని పరిపాలించేవారు.
👉🏻ఈ విధంగా మాలిక్‌ కపూర్‌ నాయకత్వంలోని ఖిల్జీ సేనలు దక్షిణ భారత రాజ్యాలన్నింటినీ ఓడించి కప్పం వసూలు చేశాయి.

పాలనా సంస్కరణలు
👉🏻అల్లావుద్దీన్‌ ఖిల్జీకి తాను సాధించిన విజయాల కంటే అమలు చేసిన పరిపాలన, సైనిక, మార్కెట్‌ సంస్కరణలే అత్యంత కీర్తి ప్రతిష్ఠలను తెచ్చాయి.
👉🏻రాజును (సుల్తాన్‌ను) భూమి మీద ఉన్న దేవుడి ప్రతినిధిగా పేర్కొన్నాడు.
👉🏻రాజు సంకల్పమే శాసనంగా ఉండాలని, రాచరికంలో బంధుత్వానికి ప్రాధాన్యం ఉండదని భావించాడు.
👉🏻ముఖ్యంగా పాలనా వ్యవహారాల్లో ఉలేమాల (మతపెద్దల) జోక్యాన్ని తగ్గించి మతం నుంచి రాజకీయాలను వేరుచేసిన తొలి ఢిల్లీ సుల్తాన్‌గా పేరొందాడు.
👉🏻పరిపాలనలో తాను అనుసరించే విధివిధానాలను గురించి పేర్కొంటూ ‘ఇది చట్టబద్దమో కాదో నాకు తెలియదు. రాజ్య శ్రేయస్సుకు మంచిదని, అత్యవసరమని నేను భావించిన ఆదేశాలను జారీ చేస్తాను. తీర్పు ఇచ్చిన రోజున ఏం జరుగుతుందో నాకు తెలియదు’ అని ప్రకటించాడు.
👉🏻ఖలీఫా నుంచి అధికారపత్రం కోసం విజ్ఞప్తి చేయకుండా తన నాణేలపై రెండో అలెగ్జాండర్‌ అనే బిరుదును ముద్రించుకున్నాడు.
👉🏻జలాలుద్దీన్‌ ఖిల్జీ కాలంలో లొంగిపోయిన మంగోలులు నయా ముస్లింలుగా భారతదేశంలో స్థిరపడి సుల్తాన్‌ పాలనా విధానాలను ప్రభావితం చేసేవారు. కానీ అల్లావుద్దీన్‌ ఖిల్జీ వారిని అణచివేసి పాలనలో జోక్యాన్ని తగ్గించాడు.
👉🏻ఈ విధంగా తన పాలనలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు.

సైనిక సంస్కరణలు
👉🏻ఇల్‌టుట్‌మిష్‌ కాలంలో ప్రవేశపెట్టిన ‘ఇక్తా’ పద్ధతిని రద్దు చేశాడు.
👉🏻సుల్తాన్‌ సొంత సైన్యాన్ని (సిద్ధ సైన్యం) రూపొందించాడు.
👉🏻సైనికులకు నగదు రూపంలో జీతాలిచ్చే పద్ధతిని ప్రవేశపెట్టిన తొలి ఢిల్లీ సుల్తాన్‌గా పేరొందాడు.
👉🏻అతడి సైనిక సంస్కరణల్లో ప్రధానమైనవి దాగ్, చెహ్రా పద్ధతులు.
👉🏻ముక్తీదారులు చక్రవర్తి ఇచ్చిన మేలు జాతి గుర్రాలను విక్రయించి వాటి స్థానంలో ముసలి గుర్రాలను ఉంచేవారు. ఇలా గుర్రాల సంఖ్య సరిపోయేలా వ్యవహరిస్తూ అవినీతికి పాల్పడేవారు. ఈ మోసాలను అరికట్టేందుకు సుల్తాన్‌ గుర్రాలపై రాజముద్రలు వేసే దాగ్‌ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ రాజముద్రలు వేసిన గుర్రాలను అమ్మడం, కొనడం నేరంగా పరిగణించాలని ప్రకటించాడు.
👉🏻ప్రస్తుత ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీపై పశువులను ఇస్తూ వాటి చెవులకు ప్రభుత్వ ముద్రలు వేయడమనేది అల్లావుద్దీన్‌ ఖిల్జీ దాగ్‌ విధాన ప్రభావమనే చెప్పవచ్చు.
👉🏻సైనికులకు నిరంతరం హాజరు వేసే ‘చెహ్రా’ విధానాన్ని ప్రవేశపెట్టాడు. చెహ్రాను సైనికులకు సంబంధించిన వివరణాత్మక పట్టికగా పేర్కొనవచ్చు.
👉🏻అల్లావుద్దీన్‌ ఖిల్జీ సైనికులు సంతృప్తిగా జీవించడానికి వీలుగా మార్కెట్‌ సంస్కరణలు అమలు చేశాడు.

మార్కెట్‌ సంస్కరణలు
👉🏻అల్లావుద్దీన్‌ ఖిల్జీ తాను ప్రవేశ పెట్టిన మార్కెట్‌ సంస్కరణల వల్ల ప్రఖ్యాతిగాంచాడు.
👉🏻నేటి ఆధునిక రైతుబజార్‌లను పోలిన విధానాన్ని ప్రవేశపెట్టాడు.
👉🏻మార్కెట్‌లో ఎవరెవరు ఏ వస్తువులను అమ్మాలో ముందుగా ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి.
👉🏻వస్తువుల ధరల పట్టికను ప్రదర్శించాలి.
👉🏻తూనికలు, కొలతల్లో మోసానికి పాల్పడరాదు.
👉🏻వీటిని అతిక్రమించిన వారికి కఠిన శిక్షలు విధిస్తామని ఆజ్ఞలు జారీ చేశాడు.
👉🏻ప్రత్యేక మార్కెట్‌ శాఖ దివాన్‌-ఇ-రియాసత్‌ను ఏర్పాటు చేసి దీనికి అధిపతిగా మాలిక్‌-యాకూబ్‌ను నియమించాడు.
👉🏻ప్రతి మార్కెట్‌పై షహనా-ఇ-మండీ అనే అధికారిని నియమించి మార్కెట్లను క్రమబద్ధం చేశాడు.
👉🏻ఢిల్లీలో పెద్ద ధాన్యాగారాన్ని నిర్మించాడు.
👉🏻ఈ విధానాల వల్ల నాడు ఢిల్లీలో కరవు కాటకాలు రాలేదని ‘బరానీ’ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు.
👉🏻ఈ మార్కెట్‌ సంస్కరణల అమలుపై చరిత్రకారులు భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఈ సంస్కరణలు సైనిక సంక్షేమానికి, సైనిక పటాలాలు ఉన్న ప్రాంతంలోనే అమలు చేశారని కొంతమంది వ్యాఖ్యానించగా, ప్రజాసంక్షేమం కోసం రాజ్యమంతటా అమలు చేశారని మరికొంతమంది పేర్కొన్నారు.

రెవెన్యూ సంస్కరణలు
👉🏻అల్లావుద్దీన్‌ ఖిల్జీ రాజ్యంలో అనేక రెవెన్యూ సంస్కరణలను అమలు చేశాడు.
👉🏻ఇతడి కంటే ముందు పరిపాలించిన ఢిల్లీ సుల్తానులు గంగా - యమునా మైదాన ప్రాంతంలోని సారవంతమైన భూములను మతాధికారులు, కులీనులకు దానం చేశారు. కానీ అల్లావుద్దీన్‌ ఈ భూములను స్వాధీనం చేసుకుని వాటిని రాచరిక/ఖలీసా భూములుగా ప్రకటించాడు.
👉🏻ముఖ్యంగా తన పాలనా కాలంలో భూమిశిస్తును 1/2వ వంతుగా నిర్ణయించాడు. ఈ శిస్తును ధన, ధాన్య రూపాల్లో చెల్లించడానికి అనుమతించాడు.
👉🏻ప్రభుత్వ ఖజానాను నింపే ఉద్దేశంతో యుద్ధ సొమ్ములో వాటా (ఖాంస్శ్‌ను సైనికులకు ఒక భాగం, ప్రభుత్వానికి నాలుగు భాగాలుగా మార్చాడు (అంతకుముందు ఈ సొమ్ములో నాలుగు భాగాలు సైనికులకు, ఒక భాగం ప్రభుత్వానికి ఉండేది).
👉🏻రెవెన్యూ విధానాల్లో అవినీతిని రూపుమాపడానికి ‘దివాన్‌-ఇ-మస్తక్‌ రాజ్‌’ అనే ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశాడు.
👉🏻భూమిశిస్తు వసూలులో నిర్లక్ష్యం వహించిన అమీల్స్, కార్కూన్స్‌ అనే అధికారులను దండించాడు. ఈ విధంగా అల్లావుద్దీన్‌ ఖిల్జీ అనేక విజయాలు సాధించడంతో పాటు వివిధ పరిపాలనా సంస్కరణలు అమలుచేసి ఢిల్లీ సుల్తానులందరిలో గొప్పవాడిగా పేరొందాడు.
👉🏻కానీ హిందువులపై అధిక పన్నులు విధించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్‌గా అల్లావుద్దీన్‌ ఖిల్జీ అపకీర్తిని పొందాడు.
👉🏻ఇతడి ఆస్థానంలో అమీర్‌ ఖుస్రూ, అమీర్‌ హసన్‌ లాంటి కవులు ఉండేవారు.

నిర్మాణములు
👉🏻అల్లావుద్దీన్‌ ఖిల్జీ గొప్ప భవన నిర్మాతగా కూడా పేరొందాడు. 1) సిరి పట్టణము: ఢిల్లీ వద్ద ఉంది. దీనిలో అతి ముఖ్యమైన కట్టడము హజార్‌ సితూన్‌ (వేయి స్తంభాలు)
2) జమాత్‌ ఖానా మసీదు: ఇది పూర్తిగాపర్షియన్‌ శైలిలో నిర్మించబడిన మొట్టమొదటి మసీదు
3) హౌజ్‌ఖాస్‌
4) అలై దర్వాజా: ఇది కుతుబ్ మినార్ యొక్క ప్రవేశ ద్వారం.
అల్లావుద్దీన్‌ ఖిల్జీ తర్వాత ఖిల్జీ పాలకులు
- 1) షిహబుద్దీన్‌
- 2) ముబారక్‌షా
- 3) ఖుస్రోఖాన్‌/ నసీరుద్దీన్‌ ఖుస్రో

‘అల్లావుద్దీన్‌ ఖిల్జీ మార్కెట్‌ సంస్కరణలు మధ్యయుగ చరిత్రలో ఒక అద్భుత ప్రయోగం’ - ఆధునిక చరిత్రకారుడు డి.ఎన్‌.డే

ఖుస్రోఖాన్‌/ నసీరుద్దీన్‌ ఖుస్రో
👉🏻తనను తాను ఖలీఫాగా ప్రకటించుకున్న ఏకైక ఢిల్లీ సుల్తాన్‌ కుతుబుద్దీన్‌ ముబారఖ్‌ ఖిల్జీ.
👉🏻చివరి ఖిల్జీ వంశపు సుల్తాన్‌గా పేరొందిన నాసిరుద్దీన్‌ ఖుస్రూషా ఒక హిందువు.
👉🏻సుల్తానత్‌ సింహాసనాన్ని అధిష్టించడానికి మతం మార్చుకున్నాడు.
👉🏻ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ 1320లో నాసిరుద్దీన్‌ ఖుస్రూషాను తొలగించి తుగ్లక్‌ వంశ పాలనను ప్రారంభించాడు.


తుగ్లక్‌ వంశము : 1820-1415

ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌

👉🏻తుగ్లక్‌ వంశ పాలనను ప్రారంభించినవారు ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌.
👉🏻ఇతడు తరుష్కుల్లో కరౌనా/ఖరౌనా తెగకు చెందినవాడు.
👉🏻అల్లావుద్దీన్‌ పరిపాలనా కాలంలో ఘియాజుద్దీన్‌ దీపాల్‌పూర్‌ వైస్రాయ్‌గా పనిచేశాడు.
👉🏻క్రీ.శ.1320లో చివరి ఖిల్జీ వంశ పాలకుడైన నాసిరుద్దీన్‌ ఖుస్రూషాను వధించి తుగ్లక్‌ వంశ పాలనను ప్రారంభించాడు.
👉🏻తుగ్లకాబాద్‌ అనే నగరాన్ని నిర్మించాడు.
👉🏻కఠిన శిక్షలను తగ్గించాడు.
👉🏻రైతు రుణాలను రద్దు చేశాడు.
👉🏻భూమిశిస్తును 1/3వ వంతుగా నిర్ణయించాడు.
👉🏻తన కుమారుడు జునాఖాన్‌ (మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌)ను దక్షిణ భారతదేశంపైకి పంపి యాదవ రాజ్యంపై విజయం సాధించాడు.
👉🏻క్రీ.శ.1323 నాటికి కాకతీయ సామ్రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు.
👉🏻కానీ క్రీ.శ.1325లో మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ తండ్రిని హత్యచేసి సింహాసనాన్ని అధిష్టించాడు.


మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ (క్రీ.శ.1325-1351)

👉🏻ఢిల్లీ సుల్తానుల సార్వభౌమాధికారాన్ని దక్షిణపథంపై నెలకొల్పిన ఏకైన ఢిల్లీ సుల్తాన్‌ మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌.
👉🏻ఢిల్లీ సుల్తానులందరిలో అత్యంత విద్యావంతుడు, ఉదార స్వభావం గల వ్యక్తిగా పేరొందిన ఇతడు తన చర్యల ద్వారా ‘పిచ్చి తుగ్లక్‌’గా పేరొందాడు.
👉🏻ఈయనను విరుద్ధ గుణాలు మూర్తీభవించిన వ్యక్తిగా సమకాలీన చరిత్రకారులు అభివర్ణించారు.
👉🏻మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ అసలు పేరు జునాఖాన్‌.
👉🏻తండ్రి ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ పాలనా కాలంలో యాదవ, కాకతీయ రాజ్యాలపై దండెత్తి అపార ధనరాశులను కొల్లగొట్టాడు.
👉🏻వరంగల్‌/ఓరుగల్లును ఆక్రమించి దానికి సుల్తాన్‌పూర్‌ అని పేరు పెట్టాడు.
👉🏻క్రీ.శ.1325లో తండ్రిని హత్యచేయించి సుల్తాన్‌గా పాలనను ప్రారంభించాడు.
👉🏻అనేక విజయాలు సాధించడమే కాకుండా పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు.
👉🏻ముఖ్యంగా రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా గంగా, యమునా మైదానంలో భూమిశిస్తు పెంచడం, రాజధాని మార్పిడి, టోకెన్‌ కరెన్సీ ముద్రణ లాంటి సంస్కరణలు విఫలమవడంతో పిచ్చి తుగ్లక్‌గా పేరొందాడు.

గంగా - యమునా అంతర్వేదిలో భూమిశిస్తు పెంచడం
👉🏻గంగా - యమునా అంతర్వేది (దోవాబ్‌)లో సారవంతమైన భూములు ఉండటం వల్ల అక్కడ భూమిశిస్తును 1/2వ వంతుకు పెంచాడు.
👉🏻రాజ్య ఆదాయాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నాడు. కానీ అదే ఏడాది ఆ ప్రాంతంలో తీవ్ర కరవు సంభవించడంతో రైతులు శిస్తు చెల్లించలేకపోయారు.
👉🏻అధికారులు ప్రజల పరిస్థితులను పట్టించుకోకుండా దౌర్జన్యంగా శిస్తు వసూలు చేశారు.
👉🏻ఆ తర్వాత సుల్తాన్‌ ప్రతిస్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టాడు.
👉🏻ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ‘దివాన్‌-ఇ-కోహీ’ అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు.
👉🏻రైతులకు తక్కావీ రుణాలు (పంట రుణాలు) మంజూరు చేశాడు. బంజరు భూములను వ్యవసాయ భూములుగా మార్చాడు.

రాజధాని మార్పు
👉🏻మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ క్రీ.శ.1327లో రాజధానిని ఢిల్లీ నుంచి దేవగిరికి (దౌలతాబాద్‌) మార్చాడు.
👉🏻ఢిల్లీ వాయవ్య భారతదేశానికి దగ్గరగా ఉండటం వల్ల నిత్యం విదేశీ దండయాత్రలకు గురికావడం, దక్షిణపథంపై పట్టు సాధించడం లాంటి కారణాలతో రాజధానిని మార్చాడు.
👉🏻కానీ రాజధానిని మార్చే సమయంలో అతడు జారీచేసిన శాసనాలు ప్రజలకు బాధ కలిగించాయని సమకాలీన చరిత్రకారులు పేర్కొన్నారు.
👉🏻రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రజలందరినీ దౌలతాబాద్‌కు వెళ్లమని ఆదేశించాడని, వెళ్లనివారిని చిత్రహింసలకు గురిచేశాడని, ఫలితంగా ప్రజలు అతడిని మంచివాడు కాదని భావించినట్లు చరిత్రకారులు తెలిపారు.
👉🏻అనేక వ్యయప్రయాసల అనంతరం రాజధానిని దౌలతాబాద్‌కు మార్చినా కొంత కాలానికే క్రీ.శ.1335లో రాజధానిని ఢిల్లీకి మార్చాడు.

టోకెన్‌ కరెన్సీ ముద్రణ
👉🏻మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ ప్రవేశపెట్టిన సంస్కరణల్లో తీవ్ర విమర్శలకు గురైంది ఈ నూతన కరెన్సీ ముద్రణ.
👉🏻ఇతడి పరిపాలనా కాలంలో వెండి కొరత ఏర్పడింది. ఢిల్లీ సుల్తాన్‌ రాజ్యంలో వెండి ‘టంకాలు’ అధికారిక నాణేలుగా చలామణీ అయ్యేవి.
👉🏻వెండి కొరత వల్ల సుల్తాన్‌ రాగి, తోలు నాణేలు ముద్రించాడని చరిత్రకారులు పేర్కొన్నారు.
👉🏻కరెన్సీ ముద్రణపై ఆంక్షలు జారీచేయకపోవడం, ప్రభుత్వమే కరెన్సీ ముద్రించాలనే షరతులు లేకపోవడంతో రాజ్యంలో నకిలీ నాణేల ముద్రణ అధికమైంది.
👉🏻నాడు దిల్లీలో ప్రతి ఇల్లు ఒక టంకశాలగా మారిందని చరిత్రకారులు తెలిపారు.
👉🏻ఫలితంగా నాణేల చలామణి అధికమై ఆర్థిక వ్యవస్థ పతనమైంది.
👉🏻ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన సుల్తాన్‌ టోకెన్‌ కరెన్సీని రద్దుచేస్తున్నట్లు ప్రకటించాడు. దాంతో ప్రజలంతా అసంతృప్తిని వ్యక్తం చేశారు.
👉🏻ప్రజల బాధలను అర్థం చేసుకున్న సుల్తాన్‌ వారి వద్ద ఉన్న టోకెన్‌ కరెన్సీకి అసలు, నకిలీ అనే తేడా లేకుండా తన ఖజానాలోని వెండి టంకాలను మార్పిడి చేశాడు.
👉🏻ఫలితంగా ఖజానా మొత్తం ఖాళీ అయ్యింది. ఇలాంటి చర్యలతో మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ ‘పిచ్చి తుగ్లక్‌గా’ పేరొందాడు.
👉🏻ఈ కరెన్సీ ముద్రణ వల్ల మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ ‘ప్రిన్స్‌ ఆఫ్‌ మనీయర్‌’ (నాణేల యువరాజు)గా పేరొందాడు.

👉🏻మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ సంస్కరణలు అనేక ఆదర్శ భావాలతో ఉండేవి.
👉🏻రాజ్య రక్షణ, రాజ్యం మధ్యలో రాజధాని ఉండాలనే ఆలోచనతోనే రాజధానిని మార్చాడు.
👉🏻దానివల్ల ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య ఆధునిక రవాణా సౌకర్యాలు ఏర్పడ్డాయి. తురుష్కుల నాగరికత, సంస్కృతి, సాంఘిక ఆలోచనా ధోరణి దక్షిణాదికి వ్యాపించింది.
👉🏻రెవెన్యూ సంస్కరణల ద్వారా వ్యవసాయరంగ అభివృద్ధికి కృషి చేశాడు.
👉🏻ప్రత్యేక వ్యవసాయ శాఖ ‘దివాన్‌-ఇ-కోహీ’ని ఏర్పాటు చేశాడు. భూమిశిస్తు బకాయిలు వసూలు చేయడానికి సెంచూరియన్‌ అనే ప్రత్యేక అధికారులను నియమించాడు.
👉🏻క్రీ.శ.1351లో నాటి గుజరాత్‌ పాలకుడు ధాగి సుల్తాన్‌ను శిక్షించడానికి వెళ్లిన మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ ‘థట్టా’ అనే ప్రాంతంలో మరణించాడు.
👉🏻అతడి మరణం గురించి పేర్కొంటూ ‘అతడి బాధ ప్రజలకు, ప్రజల బాధ అతడికి తప్పింది’ అని లేన్‌పూలే చరిత్రకారుడు తెలిపాడు.
👉🏻మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ పాలనా కాలంలోనే దక్షిణ భారతదేశంలో విజయనగర (1336), బహమనీ (1347) సామ్రాజ్యాలు అవతరించాయి.

ఫిరోజ్‌షా తుగ్లక్‌ (క్రీ.శ.1351-1388)

👉🏻మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ మరణానంతరం అతడి సోదరుడు ఫిరోజ్‌షా తుగ్లక్‌ పరిపాలించాడు.
👉🏻ఇతడు వ్యవసాయరంగ అభివృద్ధికి అనేక కాలువలు నిర్మించి ‘రైతు బాంధవుడు’గా పేరొందాడు.
👉🏻తన ప్రధానమంత్రి ఖాన్‌-ఇ-జహాన్‌-మక్బూల్‌ సాయంతో పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేశాడు.
👉🏻మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ చర్యల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనే లక్ష్యంతో అనేక సంస్కరణలు చేపట్టాడు.
👉🏻నీటిపారుదల వసతులు కల్పించాడు.
👉🏻యమునా నది నుంచి ఫిరోజాబాద్‌ వరకు, సట్లెజ్‌ నది నుంచి ఘఘ్గర్‌ వరకు, మాండవ నుంచి హిస్సార్‌ వరకు నీటిపారుదల కాలువలు ఏర్పాటు చేశాడు. ఆ కాలువలు నేటికీ పంజాబ్, హరియాణాల్లో నీటిని అందిస్తున్నాయి.
👉🏻సుమారు 23 రకాల పన్నులను రద్దు చేసి ముస్లిం మత సూత్రాల ప్రకారం ఖరజ్, ఖామ్స్, జకత్, జిజియా అనే నాలుగు ప్రధానమైన పన్నులను వసూలు చేశాడు.
👉🏻ఫిరోజాబాద్, జాన్‌పూర్, ఫతేబాద్, హిస్సార్‌ లాంటి నూతన పట్టణాలను నిర్మించాడు.
👉🏻ఫిరోజ్‌షా తుగ్లక్‌ ఈ క్రింది శాఖలను ఏర్పాటు చేశాడు.
1) దివాన్‌-ఇ-బందగామ్‌ : బానిసల శాఖ
2) దివాన్‌-ఇ-ఖైరాత్‌ : దానధర్మాలు (ప్రధానంగా పేద మహిళల వివాహం కొరకు)
3) దివాన్‌-ఇ-ఇస్తియాఖ్‌ : పింఛనుల శాఖ
4) మజ్లిష్‌-ఇ-కలావత్‌ : మంత్రుల శాఖ
5) దర్‌-ఉల్‌-షఫా : ఉచిత వైద్యశాల
👉🏻ఇతను అనేక పట్టణాలు నిర్మించాడు.
ఉదా॥ జౌన్‌పూర్‌, హిస్సార్‌, ఫిరోజ్‌షా కోట్ల, ఫిరోజాబాద్‌, ఫతేబాద్‌
👉🏻ఇతను కొన్ని బంగారు నాణాలను ప్రవేశపెట్టాడు.
ఉదా|| అథై, భిక్‌, షష్‌గని, హస్త్‌గని
👉🏻ఢిల్లీలో దారుల్‌-షఫా (దార్‌-ఉల్‌-షిఫా) అనే ప్రజా వైద్యశాలను ఏర్పాటు చేశాడు
. 👉🏻బాటసారులు, యాత్రికుల కోసం సుమారు 200 సరాయిల (విశ్రాంతి మందిరాలు)ను నిర్మించాడు.
👉🏻సమకాలీన చరిత్రకారుడైన షమ్స్‌ ఇ సిరాజ్‌ ఫిరోజ్‌షా తుగ్లక్‌ పాలనా వ్యవహారాల గురించి అనేక విషయాలు తెలిపాడు.
👉🏻ఫిరోజ్‌షా తుగ్లక్‌ పరమత సహనాన్ని అనుసరించలేదు.
👉🏻అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి, జిజియా పన్ను విధించాడు.
👉🏻బ్రాహ్మణులపై కూడా ఈ పన్ను విధించాడు. ఒరిస్సాలోని జ్వాలాముఖి ఆలయాన్ని ధ్వంసం చేశాడు.
👉🏻ఇతడి ఆస్థానంలో బరౌనీ, షమ్స్‌ ఇ సిరాజ్, మహ్మద్‌ అఫీఫ్‌ లాంటి చరిత్రకారులు, కవులు; జలాలుద్దీన్‌-రూమీ లాంటి పండితులు ఉండేవారు.
👉🏻ఫిరోజ్‌షా తుగ్లక్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీ రద్దు చేసిన ఇక్తా పద్ధతిని తిరిగి జాగిర్దారీ పద్ధతిగా ప్రవేశపెట్టాడు. సివిల్, మిలిటరీ ఉద్యోగాలను వంశపారంపర్యం చేశాడు.
👉🏻ముఖ్యంగా 1,80,000 మంది బానిసలను పోషించి ఖజానా ఖాళీ చేశాడని అఫీఫ్‌ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు.
👉🏻పెరిస్టా అనే చరిత్రకారుడి ప్రకారం ఫిరోజ్‌షా తుగ్లక్‌ 50 ఆనకట్టలు, 40 మసీదులు, 30 కళాశాలలను నిర్మించినట్లు తెలుస్తుంది. మీరట్, తోప్రా ప్రాంతాల్లో ఉన్న అశోక స్తంభాలను ఢిల్లీకి (ఫిరోజాబాద్‌) తరలించాడు. ఈ విధంగా అనేక ప్రజా సంక్షేమ చర్యలతోపాటు ప్రజా, హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డాడు.
👉🏻ఫిరోజ్‌షా తుగ్లక్‌ ‘ఫతూహత్‌-ఇ-ఫిరోజ్‌ షాహీ’ పేరుతో తన స్వీయచరిత్రను రాశాడు.
👉🏻ఇతడి అనంతరం రెండో ఘియాజుద్దీన్, అబూబకర్, మహ్మద్‌ బీన్‌ ఫిరోజ్, నాసిరుద్దీన్‌ మహ్మద్‌ తుగ్లక్‌ లాంటి పాలకులు పాలించారు.
👉🏻వీరు అసమర్థులు కావడంతో తుగ్లక్‌ వంశం పతనమైంది.
👉🏻చివరి తుగ్లక్‌ వంశ పాలకుడైన నాసిరుద్దీన్‌ మహ్మద్‌ తుగ్లక్‌ పాలనా కాలంలోనే క్రీ.శ.1398-99లో తైమూర్‌ దండయాత్ర జరిగింది.
👉🏻క్రీ.శ.1414లో ఖిజీర్‌ఖాన్‌ నాసిరుద్దీన్‌ తుగ్లక్‌ను తొలగించి సయ్యద్‌ వంశ పాలనను ప్రారంభించాడు.


సయ్యద్‌ వంశము : 1415-1451

ఖిజీర్‌ఖాన్‌
👉🏻ఖిజిర్‌ఖాన్‌(ఇబ్నెమాలిక్‌ సులేమాన్‌) తాను మహ్మద్‌ ప్రవక్త సంతతికి చెందినవాడినని ప్రకటించుకున్నాడు.
👉🏻ఇతని బిరుదులు-రాయత్‌-ఇ-అలా, మన్సద్‌-ఇ-ఆలీ.
👉🏻ఇతని తర్వాత సయ్యద్‌ వంశ పాలకులు
1) ముబారక్‌ షా(1421-34)
2) మొహ్మద్‌ షా (1434-45)
3) అల్లావుద్దీన్‌ ఆలమ్‌షా (1445-51)
👉🏻ముబారక్‌ షా కాలంలో యహ్య-బిన్‌-అహ్మద్‌ సర్హింది “తారీఖ్‌-ఇ- ముబారక్‌షాహీ” అనే పుస్తకాన్ని రచించాడు.
👉🏻అల్లాఉద్దీన్‌ ఆలంషా రాజ్యాన్ని బహలుల్‌ లోడీకు త్యజించి బదౌన్‌కు వెళ్ళిపోయాడు. ఇతను1478లో మరణించాడు.


లోడీ వంశము : 1451-1526

బహలూల్‌ లోడీ (1451-89):

👉🏻ఇతను కూడా బహలూల్‌లోడీ జౌన్‌వూర్‌ను ఆక్రమించాడు (1483-84).
(జౌన్‌పూర్‌ను సిరాజ్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌/ తూర్పు యొక్క కిరీటం అంటారు. దీనిని షర్కీ వంశము పాలించింది)
👉🏻ఇతని కాలంలో అహ్మద్‌ యాద్‌గార్‌ 'తారిఖ్‌-ఇ-సుల్తానా ఆష్టానా' అనే పుస్తకాన్ని రచించాడు.
👉🏻ఇతని తర్వాత పాలకుడు -సికిందర్‌ లోడీ

సికిందర్‌ లోడీ (1489-1517):

👉🏻ఇతను లోడీ వంశంలో అతి గొప్పవాడు.
👉🏻ఇతని అసలు పేరు - నిజాంఖాన్‌ లేదా నిజాంషా
👉🏻ఇతను 1504లో ఆగ్రా పట్టణాన్ని నిర్మించాడు. ఆగ్రాలో ఇటుకల కోటను నిర్మించాడు.
👉🏻1506లో రాజధానిని ఆగ్రాకు మార్చాడు.
👉🏻ఢిల్లీలో లోడీ గార్డెన్స్‌ను ఏర్పాటు చేశాడు
👉🏻ఇతను ఒక గొప్పకవి.
👉🏻పర్షియా భాషలో అనేక కవిత్వములను రచించాడు.
👉🏻ఇతని కలం పేరు - నాంద్‌పూమే యొక్క గుల్‌రుఖ్‌ (Golrukh of Nomdephume)
👉🏻ఇతని కాలంలో ఒక సంస్కృత వైద్యశాస్త్ర గ్రంథం పర్షియాలోకి అనువాదించబడింది.
👉🏻అబుల్‌ ఫజల్‌ ప్రకారం ఇతనికాలంలోనే కబీర్‌ ఉండేవాడు.
👉🏻ఇతను భూమి కొలతలో గజ్‌-ఇ-సికందరీ అనే విధానమును ప్రవేశపెట్టాడు.
👉🏻ఫిరోజ్‌ తుగ్గక్‌ వలెనే యితడు కూడా “ఉలేమాలి ప్రభావంతో విగ్రహాలను నాశనం చేసి, వారిపై “జిజియా”, తీర్ధయాత్ర పన్నును విధించాడు.
👉🏻ఇతని తర్వాత పాలకుడు - ఇబ్రహీంఖాన్‌ లోడీ

ఇబ్రహీంఖాన్ లోడీ:

👉🏻చివరి లోడీ వంశ పాలకుడు ఇబ్రహీం లోడీని క్రీ.శ.1526లో బాబర్‌ మొదటి పానిపట్టు యుద్ధంలో ఓడించి మొఘల్‌ సామ్రాజ్యాన్ని స్థాపించడంతో ఢిల్లీ సుల్తానత్‌ సామ్రాజ్యం అంతరించింది.
👉🏻లోడీల కాలంలో ఇక్తా పదం బదులు పరగణ, సర్కార్‌ అనే పదాలు బాగా వ్యాప్తిలోకి వచ్చాయి.
👉🏻ఈ క్రింది ఢిల్లీ సుల్తానుల తల్లులు హిందువులు.
1) ఖుస్రోఖాన్‌ (ఖిల్జీల చివరి పాలకుడు)
2) గియాజుద్దీన్‌ తుగ్లక్‌ (తుగ్లక్‌ వంశ స్థాపకుడు)
3) ఫిరోజ్‌ షా తుగ్లక్‌
4) సికందర్‌ లోడీ
👉🏻ఢిల్లీ సుల్తానుల కాలంలో కవులు, చరిత్రకారులు: 👉🏻ఆల్బెరూనీ : తారిక్‌-ఇ-హింద్‌ (దీనిని ఆంగ్లంలో అనువదించిన వాడు సచావో) 👉🏻ఉత్భి : తారిక్‌-ఇ-యమినీ (మొహ్మద్‌ గజినీ చరిత్ర) 👉🏻ఫిరదౌసి. : షానామా (గజినీ ప్రాంతం-గురించి వివరిస్తుంది) 👉🏻పై ముగ్గురూ గజినీ కాలంలో ఉండేవారు. 👉🏻హసన్‌ నిజామి. : తాజుల్‌ మజర్‌ (ఐబక్‌ కాలంలో ఉండేవాడు) 👉🏻మిన్హాజ్‌-ఉల్‌-సిరాజ్‌ : తబాకత్‌ నజరీ (రజియా సుల్తానా గురించి, ఈ పుస్తకం నజీరుద్దీన్‌ మొహ్మద్‌కు అంకితం చేయబడింది). ఇతను ఇల్‌టుట్‌ మిష్‌ కాలంలో ఉండేవాడు 👉🏻ఇబన్‌ బటుటా : ఇతను మొరాకో దేశానికి చెందినవాడు. 👉🏻ఇతను 1333లో మహ్మద్‌బిన్‌ తుగ్గక్‌ ఆస్థానాన్ని సందర్శించాడు. 👉🏻మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌ ఇతన్ని ఢిల్లీ యొక్క కాజీ (న్యాయమూర్తిగా) నియమించాడు. 👉🏻1342లో బటూటాను తన రాయబారిగా చైనాకు పంపాడు. 👉🏻బటూటా సఫర్‌ నామా, రివ్లాద్‌ అనే పుస్తకాలు రచించాడు. 👉🏻వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటుల సామంతులుగా ఉంటూ బోధన్‌, వేములవాడలను కేంద్రాలుగా చేసుకొని తెలంగాణలో పశ్చిమోత్తర ప్రాంతాలను పాలించారు.
👉🏻వీరి రాజధానులు:
1) తొలి రాజధాని - బోధన్‌
2) తర్వాత రాజధాని - వేములవాడ
👉🏻బి.యన్‌. శాస్త్రి గారి అభిప్రాయం ప్రకారం తెలంగాణలోని సపాదలక్ష దేశమును రాష్ట్రకూటుల సామంతులుగా బోధన్‌, గంగాధర, వేములవాడ వట్టణాలను రాజధానులుగా పాలించినవారు వేములవాడ చాళు క్యులు.
👉🏻సపాదలక్ష దేశము అనగా ఒక లక్షా యాఖై వేల బంగారు నాణెముల ఆదాయం కలిగిన దేశం (కొందరి అభిప్రాయం ప్రకారం లక్షా పాతిక వేల గ్రామాలు కలిగిన దేశం).
👉🏻గోదావరి నదికి దక్షిణాన గల మంజీర నది నుండి మహాకాళేశ్వర పర్యంతం వ్యావించివున్న భూభాగమే పోదననాడు. దీన్నే సపాదలక్ష దేశం అంటారు. ఇదే వేములవాడ చాళుక్య రాజ్యం.
👉🏻తర్వాత కాలంలో ఈ ప్రాంతం కరీంనగర్‌ జిల్లాలోని సబ్బినాడని, సబ్బిసాయర్‌ మండలమని పిలువబడింది
👉🏻క్రీ.శ. 750-973 వరకు సుమారు 225 సం॥ల పాటు వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటుల సామంతులుగా పాలించారు

తొలి పాలకులు :
1) సత్యాశయ రణవిక్రముడు క్రీ.శ. 641-660
2) పృథ్వీపతి క్రీ.శ. 660-695
3) మహారాజు క్రీశ. 695-725
4) రాజాధిపత్య పృదువిక్రముడు క్రీ.శ. 725-750
👉🏻వేములవాడ చాళుక్య మూల పురుషుడు సత్యాశయ రణవిక్రముడు (కొల్లిపర శాసనం ప్రకారం)
👉🏻ఇతను బాదామి చాళుక్య రాజైన 2వ పులకేశి నుండి బోధన్‌ ప్రాంతాన్ని పొంది పాలించారు
👉🏻సత్యాశ్రయ రణవిక్రముడి తర్వాత మిగతా వారు ఈ రాజ్యాన్ని పాలించినవ్పటికీ వీరి పరిపాలనకు సంబంధించిన విషయాలు పెద్దగా తెలియలేదు

పరిపాలనా విధానం

కేంద్రపాలన

        ఢిల్లీ సుల్తానులు ఇస్లామిక్‌ సంప్రదాయ ‘షరియత్‌’ ప్రకారం భారతదేశాన్ని పరిపాలించారు. సుల్తాన్‌ను భగవంతుడి ప్రతిరూపంగా భావించి పాలించారు. వారు తమ రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ఇక్తాలు - షిక్‌లు - పరగణాలు - గ్రామాలుగా విభజించారు. కేంద్రస్థాయిలో సుల్తాన్‌ సర్వాధికారి, నిరంకుశుడు. సుల్తాన్‌కు పరిపాలనలో సహాయపడటానికి మంత్రిమండలి ఉండేది. నాడు కేంద్ర మంత్రిమండలిలో వజీర్‌ (ఆర్థికమంత్రి), దివాన్‌-ఇ-అర్జ్‌ (యుద్ధ మంత్రి), దివాన్‌-ఇ-రిసాలత్‌ (విదేశీ వ్యవహారాల మంత్రి), దబీర్‌-ఇ-మమాలిక్‌ (సమాచార మంత్రి), సదర్‌-ఉస్‌-సుదూర్‌ (ధర్మాదాయ, ధార్మిక మంత్రి), దివాన్‌-ఇ-ఖాజీ/ ఖాజీ-ఉల్‌-కుజత్‌ (న్యాయశాఖా మంత్రి) లాంటి మంత్రులు ఉండేవారు. సుల్తాన్‌కు సహాయపడటానికి నాయిబ్‌ సుల్తాన్‌ (ఉప ప్రధానమంత్రి) కూడా ఉండేవాడు. ఈ విధంగా కేంద్రంలో సుల్తాన్‌ సర్వాధికారాలు కలిగి ఉండి మంత్రిమండలి, ఉద్యోగ బృంద సహాయంతో పరిపాలించేవాడు.

రాష్ట్ర పాలన

        ఢిల్లీ సుల్తానుల కాలం నాటి రాష్ట్రాలను ఇక్తాలు అనేవారు. ఇల్‌టుట్‌మిష్‌ ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇక్తా అధిపతిని ముక్తీ అనేవారు. ఇక్తాలు అనేవి సైనిక రాష్ట్రాలుగా పేరొందాయి. ముక్తీలు రాజు ద్వారా నియమితులై ఇక్తాల నుంచి వచ్చిన ఆదాయంలో కొంత భాగం తీసుకుని సైన్యాన్ని పోషించి యుద్ధ సమయంలో సుల్తాన్‌కు సరఫరా చేయాలి. ఇక్తాల్లో ఉండే రాజ ప్రతినిధిని (గవర్నర్‌) నాయిమ్‌/వలి అని పిలిచేవారు. ముక్తీ, నాయిమ్‌తో పాటు రాష్ట్రాల్లో వజీర్, అరిజ్, ఖ్వాజీ లాంటి అధికారులు ఉండేవారు. రాష్ట్రాల్లో ఇక్తాలతో పాటు ప్రాంతాలు, సామంత రాజ్యాలు కూడా ఉండేవి. ప్రాంతాలను ఉప రాజ్యాలు అనేవారు.

స్థానిక పాలన

        ఢిల్లీ సుల్తానులు రాష్ట్రాలు/ప్రాంతాలు/ఇక్తాలను షిక్‌లు, పరగణాలు, గ్రామాలుగా విభజించి పరిపాలించారు. షిక్‌ల అధిపతిని షిక్‌దార్, పరగణాల అధిపతిని అమీల్, గ్రామ అధికారులను చౌదరీ, ముఖద్దమ్‌ అని పిలిచేవారు. గ్రామపాలనలో స్వయంప్రతిపత్తి ఉండేది. కొన్ని గ్రామాల్లో పట్వారీ అనే అధికారి ఉండేవాడు. ఈ విధంగా ఢిల్లీ సుల్తానులు ఇస్లాం న్యాయ షరియత్‌ ప్రకారం పాలించినప్పటికీ గతంలో భారతదేశంలో ఉన్న పాలనా వ్యవస్థనే అనుసరించారని అర్థమవుతుంది. రాజు స్థానంలో సుల్తాన్‌ వచ్చాడు. అదే మంత్రిమండలి విధానం, రాజ్య విభజన విధానం, ఉద్యోగ బృంద సహకారం కొనసాగింది కానీ వారి పేర్లు మార్పు చెందాయి.

రెవెన్యూ పాలన

        ఢిల్లీ సుల్తానులు రెవెన్యూ విధానంలో అనేక నూతన మార్పులను ప్రవేశపెట్టారు. ప్రత్యేక శాఖలను రూపొందించి భూముల సర్వే, విభజన, పంట ఆధారంగా భూమిశిస్తును నిర్ణయించారు. కుతుబుద్దీన్‌ ఐబక్‌ కాలంలో పంటలో 1/10వ వంతును శిస్తుగా నిర్ణయిస్తే అల్లావుద్దీన్‌ ఖిల్జీ, మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ కాలంలో 1/2వ వంతుగా నిర్ణయించారు. కానీ ఎక్కువ మంది సుల్తానులు 1/3వ వంతునే భూమిశిస్తుగా వసూలు చేశారు. అల్లావుద్దీన్‌ ఖిల్జీ రెవెన్యూ శాఖలో అవినీతిని నిర్మూలించడానికి ప్రత్యేక అధికారులను నియమించాడు. మహ్మద్‌బీన్‌ తుగ్లక్‌ ‘దివాన్‌-ఇ-కోహీ’ అనే ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటుచేసి రెవెన్యూ పాలనను పటిష్ఠం చేశాడు. బాల్బన్‌ తొలిసారిగా అడవులను నరికించి వాటిని వ్యవసాయ భూములుగా మార్చాడు. ఫిరోజ్‌షా తుగ్లక్‌ రైతు బాంధవుడిగా పేరొందాడు.

 

సైనిక పాలన

        ఢిల్లీ సుల్తానుల కాలం నాటి సైనిక విధానాన్ని ‘ఇక్తా పద్ధతి’ అంటారు. ఢిల్లీ సుల్తానత్‌ సామ్రాజ్య ప్రగతి ఎక్కువగా సైనిక వ్యవస్థపైనే ఆధారపడి ఉండేది. ముఖ్యంగా మంగోలుల లాంటి విదేశీయుల దండయాత్రలను సమర్థంగా ఎదుర్కోవడానికి, రాజ్య విస్తరణకు సైనికశక్తి అవసరమని గుర్తించిన ఢిల్లీ సుల్తానులు సైనిక పాలనకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.
        ఇల్‌టుట్‌మిష్‌ ‘ఇక్తాలు’ అనే సైనిక రాష్ట్రాలను ఏర్పాటుచేసి, వాటిపై ముక్తీలనే అధికారులను నియమించాడు. ముక్తీలు తమ అధీనంలో ఉన్న ఇక్తాల నుంచి శిస్తు వసూలు చేసి కొంతభాగాన్ని సుల్తాన్‌కు చెల్లించి, మిగిలిన దానితో సైన్యాన్ని పోషించి యుద్ధ సమయంలో సుల్తాన్‌కు సరఫరా చేసేవారు. బాల్బన్‌ తన పాలనా కాలంలో దివాన్‌-ఇ-అర్జ్‌ అనే ప్రత్యేక యుద్ధ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశాడు. సుల్తానుల కాలం నాటి సైనిక వ్యవస్థలో అల్లావుద్దీన్‌ ఖిల్జీ అనేక మార్పులు చేపట్టాడు.
        ఇతడు ఇక్తా పద్ధతిని రద్దుచేసి, సైనికులకు నగదు రూపంలో జీతం ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ముక్తీలు చేస్తున్న అక్రమ గుర్రాల మార్పిడిని నియంత్రించడానికి గుర్రాలపై రాజముద్రలు వేసే పద్ధతి (దాగ్‌)ని ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా సుల్తాన్‌ సొంత సైన్యం (సిద్ధ సైన్యం)ను రూపొందించాడు. సైనికుల్లో క్రమశిక్షణ పెంచడానికి చెహ్రా అనే హాజరుపట్టీ/మస్తరు విధానాన్ని రూపొందించాడు. తక్కువ జీతం గల సైనికులకు నిత్యావసరాలను తక్కువ ధరలకు అందించడానికి మార్కెట్‌ సంస్కరణలు అమలుచేశాడు. కానీ ఫిరోజ్‌షా తుగ్లక్‌ కాలంలో ఇక్తా పద్ధతిని తిరిగి జాగిర్ధారీ పద్ధతిగా ప్రవేశపెట్టారు. సైనిక పదవులు వంశపారంపర్యం కావడంతో క్రమంగా సైనిక వ్యవస్థ నిర్వీర్యమైంది. ఫలితంగా సుల్తానుల సామ్రాజ్యం పతనమైంది.
 

న్యాయపాలన

సామ్రాజ్యంలో సుల్తాన్‌ అత్యున్నత న్యాయాధికారి. అతనికి న్యాయపాలనలో సాయపడటానికి ప్రధాన ఖాజీ అనే న్యాయశాఖ మంత్రి ఉండేవాడు. అదే విధంగా రాష్ట్ర, స్థానిక స్థాయిల్లోనూ న్యాయపాలన కోసం ప్రత్యేక అధికారులను నియమించారు. గ్రామస్థాయిలో గ్రామపెద్దలే తీర్పులు చెప్పేవారు. ఇలానే ఢిల్లీ సుల్తానులు ఖురాన్, షరియత్‌ ప్రకారం న్యాయ పాలన నిర్వహించేవారు. శిక్షలు కఠినంగా ఉండేవి. అల్లావుద్దీన్‌ ఖిల్జీ మరింత కఠినంగా వ్యవహరించేవాడు. ‘నాకు షరియత్‌ (ముస్లిం చట్టం) తెలియదని, రాజ్య శ్రేయస్సుకు ఏది మంచిదయితే దాన్నే అమలు చేస్తానని’ బహిరంగంగా ప్రకటించాడు.


సాంఘిక పరిస్థితులు

అల్‌బెరూనీ, అమీర్‌ఖుస్రూ, బరౌనీ, ఇసామీ, ఇబన్‌  బటూటా వంటి సమకాలీన రచయితలు, చరిత్రకారుల రచనల ద్వారా ఢిల్లీ సుల్తానుల కాలం నాటి వివిధ పరిస్థితులను తెలుసుకోవచ్చు. నాటి సమాజంలో అధిక శాతం హిందువులే ఉన్నారు. సమాజంలో వివిధ వర్గాలు, వారి మధ్య వ్యత్యాసాలు, కుల వ్యవస్థ, ఆచార సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, స్త్రీ స్థానం, సాంఘిక దురాచారాలు వంటి అంశాలను పరిశీలిస్తే నాటి సాంఘిక వ్యవస్థపై ఒక అవగాహన కలుగుతుంది. అంత వరకు పాలకులుగా ఉన్న అధిక శాతం హిందువులు మహ్మదీయుల పాలనలో పాలితులుగా మారడంతో సామాజిక వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముస్లింల సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, సాంఘిక దురాచారాలు భారతీయ సమాజంలో ప్రవేశించాయి. ముఖ్యంగా పరదా పద్ధతి, బహు భార్యత్వం, జౌహార్‌ వంటి సాంఘిక దురాచారాలు అధికమయ్యాయి. ఫలితంగా సమాజంలో స్త్రీకి ప్రాధాన్యం తగ్గింది. స్త్రీ విద్యకు ప్రోత్సాహం కరవైంది. అనేక నూతన వర్గాలు వెలిశాయి. పెద్దఎత్తున మత మార్పిడులు జరిగాయి. మహ్మదీయులు కులవ్యవస్థను అనుసరించారు. హిందువుల పండగలను ముస్లింలు, ముస్లింల సంప్రదాయాలను హిందువులు అనుసరించారు. నూతనంగా ఏర్పడిన ఉలేమాలు, కుట్స్, కులీనులు వంటి వర్గాలవారు అధిక పెత్తనం చెలాయిస్తూ ఆర్థికవ్యత్యాసాలకు కారణమయ్యారు.


ఆర్థిక పరిస్థితులు

        ఢిల్లీ సుల్తానుల కాలంలో వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల రంగాల అభివృద్ధిని పరిశీలిస్తే నాటి ఆర్థిక పరిస్థితులు అర్థమవుతాయి. వ్యవసాయ రంగ అభివృద్ధికి ఢిల్లీ సుల్తానులు అనేక చర్యలు చేపట్టారు. ఫలితంగా పట్టణ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థల్లో అనేక నూతన మార్పులు చోటుచేసుకున్నాయి. ఆహార, వాణిజ్య పంటలకు సమాన ప్రాధాన్యం  ఇచ్చారు. నీటిపారుదల సౌకర్యాలు కల్పించారు. బంజరు భూముల్ని వ్యవసాయ భూములుగా మార్చడానికి కృషి చేశారు. నాటి కాలంలో ఇక్తా భూములు, ఖలీసా భూములు, మదద్‌ - ఇ - మాష్‌ భూములు అనే మూడు ప్రధాన రకాలు ఉండేవి. ముక్తీల అధీనంలో ఉండే భూములు ఇక్తా భూములు. సుల్తాన్‌ అధీనంలో ఉండే భూములు ఖలీసా భూములు. వీటి నుంచి వచ్చే ఆదాయం నేరుగా ఖజానాకు చేరేది. వివిధ వర్గాలవారికి పాలకులు దానంగా ఇచ్చిన భూములను మదద్‌ - ఇ - మాష్‌ భూములు అనేవారు. ఫిరోజ్‌షా తుగ్లక్‌ వ్యవసాయ అభివృద్ధికి నాలుగు ప్రధాన కాలువలు తవ్వించి రైతుబాంధవుడిగా పేరొందాడు. సుల్తానుల కాలంలో తోటపంటలు బాగా అభివృద్ధి చెందాయి.

        ఫలితంగా గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. భూమిశిస్తుతో పాటు ఖామ్స్, జకత్, జిజియా వంటి పన్నులు వసూలు చేసేవారు. రాజ్యానికి అధిక ఆదాయం భూమిశిస్తు (ఖరజ్‌) ద్వారా సమకూరేది. కానీ ప్రజలు అధిక పన్నుల భారంతో బాధపడేవారు. పట్టణాల సంఖ్య పెరగడం, వృత్తి పనివారు అధికంగా వస్తువులు ఉత్పత్తి చేయడం, వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందడం అనే మూడు ప్రధాన కారణాల వల్ల పట్టణ ఆర్థిక వ్యవస్థలో నూతన మార్పులు చోటుచేసుకున్నాయి. తురుష్కుల రాకతో వస్త్ర, పట్టు, కాగితం పరిశ్రమల అభివృద్ధి సాధ్యమైంది. భవన నిర్మాణ రంగంలో సాంకేతికత పెరిగింది. ఢిల్లీలో ఉన్న భవన నిర్మాణ మేస్త్రీలు ఇస్లాం రాజ్యాలున్న అన్ని దేశాల కంటే నైపుణ్యం కలవారని అమీర్‌ఖుస్రూ పేర్కొన్నాడు. చర్మ, లోహ పరిశ్రమలు, తివాచీల అల్లకం, ఆభరణాల రూపకల్పన వంటి రంగాల్లో అభివృద్ధి జరిగింది.

        వ్యవసాయ, పరిశ్రమల రంగాలతో పాటు వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చెందాయి. భారతదేశం నుంచి పర్షియన్‌ సింధుశాఖ, ఎర్ర సముద్రం, ఆగ్నేయాసియా దేశాలకు వస్తువులు ఎగుమతయ్యేవి. విదేశీ వాణిజ్యంతో పాటు  దేశీయ వాణిజ్యం కూడా వృద్ధి చెందింది. మార్వాడీలు, జైనులు, ముల్తానీలు దేశీయ వ్యాపారంలో ప్రధాన పాత్ర పోషించారు.  ముల్తానీలు చాలా ధనవంతులని, కులీన వంశస్థులకు భారీగా రుణాలు ఇచ్చే వారని బరౌనీ అనే చరిత్రకారుడు పేర్కొన్నాడు. విదేశాల నుంచి భారీగా వృత్తి పని వారు వలస వచ్చేవారని ఇస్సామీ తెలిపాడు. ఎంత అభివృద్ధి జరిగినా ధనిక, కులీన వర్గాలు మాత్రమే లబ్ధి పొందాయని చెప్పొచ్చు. రైతాంగం, బానిసలు, కూలీలు, మధ్య తరగతి వర్గం అధిక పన్నుల భారంతో బాధపడేవారని సమకాలీన చరిత్రకారుల అభిప్రాయం.

ఈ క్రింది ఢిల్లీ సుల్తానుల తల్లులు హిందువులు.

ఈ క్రింది ఢిల్లీ సుల్తానుల తల్లులు హిందువులు.
1) ఖుస్రోఖాన్‌ (ఖిల్జీల చివరి పాలకుడు)
2) గియాజుద్దీన్‌ తుగ్లక్‌ (తుగ్లక్‌ వంశ స్థాపకుడు)
3) ఫిరోజ్‌ షా తుగ్లక్‌
4) సికందర్‌ లోడీ

ఢిల్లీ సుల్తానుల కాలంలో కవులు, చరిత్రకారులు:

ఆల్బెరూనీ : తారిక్‌-ఇ-హింద్‌ (దీనిని ఆంగ్లంలో అనువదించిన వాడు సచావో)
ఉత్భి : తారిక్‌-ఇ-యమినీ (మొహ్మద్‌ గజినీ చరిత్ర)
ఫిరదౌసి : షానామా (గజినీ ప్రాంతం-గురించి వివరిస్తుంది)
పై ముగ్గురూ గజినీ కాలంలో ఉండేవారు.
హసన్‌ నిజామి : తాజుల్‌ మజర్‌ (ఐబక్‌ కాలంలో ఉండేవాడు)
మిన్హాజ్‌-ఉల్‌-సిరాజ్‌ : తబాకత్‌ నజరీ (రజియా సుల్తానా గురించి, ఈ పుస్తకం నజీరుద్దీన్‌ మొహ్మద్‌కు అంకితం చేయబడింది). ఇతను ఇల్‌టుట్‌ మిష్‌ కాలంలో ఉండేవాడు


ఇబన్‌ బటుటా : ఇతను మొరాకో దేశానికి చెందినవాడు.
ఇతను 1333లో మహ్మద్‌బిన్‌ తుగ్గక్‌ ఆస్థానాన్ని సందర్శించాడు.
మహ్మద్‌బిన్‌ తుగ్లక్‌ ఇతన్ని ఢిల్లీ యొక్క కాజీ (న్యాయమూర్తిగా) నియమించాడు.
1342లో బటూటాను తన రాయబారిగా చైనాకు పంపాడు.
బటూటా సఫర్‌ నామా, రివ్లాద్‌ అనే పుస్తకాలు రచించాడు.


అమీర్‌ ఖుస్రో:
ఇతని అసలు పేరు - హసన్
ఇతని బిరుదు - భారతదేశ రామచిలుక
ఇతన్ని నాయక్‌ అని కూడా అంటారు
ఇతను ఏడుగురు ఢిల్లీ సుల్తానుల ఆస్థానంలో ఉన్నారు (బాల్బన్‌ నుండి గియాజుద్దీన్‌ వరకు).
ఇతను ఒక గొప్పకవి, చరిత్రకారుడు, సంగీతకారుడు.
ఇతని పుస్తకాలు
1) ఖజరా ఉస్‌-సదిస్‌(కైకూబాద్‌ కోరిక మేరకు రాశాడు)
2) తారిక్‌-ఇ-అలై (అల్లావుద్దీన్‌ ఖిల్జీ గురించి తెలుపుతుంది)
3) ఆపష్కీ (కిజిర్‌ఖాన్‌-దేవల్‌రాణి ప్రేమాయణం)
4) నూషిఫర్‌ (ముబారక్‌ ఖిల్టీ గురించి, భారతదేశం గొప్పతనం గురించి ఇందులో పేర్కొన్నాడు)
5) తుగ్లక్‌ నామా (ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ గురించి)
ఇతను ఇండియాలో సితార్‌, తబలాను ప్రవేశపెట్టాడు.
ఇతను అనేక రాగాలను రచించాడు
ఉదా॥ గోరా, ఐమన్‌, సారంగి
ఇండియాలో కవ్వాలీని ప్రవేశపెట్టాడు.

జియావుద్దీన్‌ బరౌనీ(ఫిరోజ్‌ తుగ్లక్‌ కాలం):
1) ఫత్వా-ఇ-జహంగరీ
2) తాజూకీ-ఇ-ఫిరోజ్‌షాహీ


షంషీ-సిరాజ్‌-ఆఫీఫ్‌ (ఫిరోజ్‌ తుగ్లక్‌ చరిత్రకారుడు): తాజూకీ-ఇ-ఫిరోజ్‌ షాహీ
ఇసామీ: ఫుతుహస్‌ సలాతిన్‌ (బహమనీ ఆస్థానంలో) (ఇండియన్‌ షానామా అని అంటారు)
అబుబకర్‌: చాచ్‌నామ
జియానక్షబి: తూతినామ, రతిరహస్య, సుఖసప్తాసి. ఇతను కోక్‌ శాస్త్రాన్ని పర్షియాలోకి అనువదించాడు.

No comments:

Post a Comment

Post Bottom Ad